Monday, July 18, 2022

బహుజన యోధుడు: మన్యవర్ కాన్షీరాం

 అది 1957,, జీవితంలో ఎన్నో సంఘర్షణలు పడి, అవమానాలు ఎదుర్కొని, కష్టపడి, DRDO (Defence Research and Development Organization)లో, 24 సంవత్సరాల నవ యువకుడిగా ఉద్యోగంలో చేరారు కాన్షిరాం.. మహారాష్ట్రలోని, పుణె పట్టణంలో పోస్టింగ్ రావడంతో, తనకు ఎంతో ఇష్టమైన,, తనను కష్టపడి పెంచిన తన తల్లిని, వదలి రాలేక,, కళ్ళ నిండా నీళ్లతో, గుండె నిండా భారంతో పుణె చేరారు కాన్షిరాం.. 
      
సిక్కు మతంలో, కుల వివక్షకు వ్యతిరేకంగా పుట్టిన, రమదాసియా సిక్కు శాఖ, ప్రభావంతో,, చిన్నప్పటి నుండి,, ఆథ్యాద్మిక దారిలో పెరిగిన,, కాన్షిరం,, పుణె వచ్చి రాగానే, తనకు దగ్గరలోని గురుద్వారా ల గురించి ఆరా తీయడం మొదలెట్టారు.. కానీ పుణె పట్టణంలో చూస్తే అంతా చిత్రమైన పరిస్థితి ఉండేది.. ఆఫీస్ లోను, బయటా ఏ దళితుడిని పలుకరించినా, జై భీమ్ అని మొదలుపెట్టి, జై భీమ్ అని ముగించే వాళ్ళు,, ఎవరో బాబా(బాబాసాహెబ్) పేరు విరివిగా వాడేవాళ్ళు.. మొదట్లో ఆయనకు ఇదంతా కొత్తగా అనిపించేది,, ఈ బాబా ఎవరో, గురు రామదాస్ గారికంటే పెద్ద ఆధ్యాత్మిక గురువు లాగా ఉన్నాడే, అనుకునే వారు.. DRDO లో దళిత సంఘాల కార్యకలాపాలు, నినాదాలు, మొదట్లో ఇవన్నీ కొత్తగా ఉండేది..

      ఇదంతా ఒక వైపు అయితే మరోవైపు,, తాను ఈసారి సెలవులకు వస్తే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తానని,, కాబట్టి ఎక్కువ సెలవులు పెట్టుకుని రావాలని, కాన్షిరాం గారి తల్లి, ప్రతి ఉత్తరంలో, చెబుతుండేది,, ఈసారి తన తల్లి మాట విని తప్పకుండా పెళ్ళి చేసుకుంటానని, బెంగ పడవద్దని, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోమని, తల్లిని సముదాయిస్తూ, కాన్షిరం గారు ఉత్తరం రాసేవారు..

కాన్షిరాం గారి జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన: 

        ఈ క్రమంలో ఉండగా, అది 1963 DRDO మొత్తంలో ఒక్కసారిగా హడావిడి మొదలైంది,, దళిత సంఘాలన్నీ ఒకే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు,,, ""ఎవరో ఒక 26 సంవత్సరాల మహర్ కుర్రాడు బాబాసాహెబ్ పుట్టిన రోజుకి సెలవు ఇవ్వాలని,, బాల గంగాధర్ జయంతికి, దీపావళికి సెలవులు ఇస్తూ బాబాసాహెబ్ పుట్టిన రోజుకు సెలవు ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తున్నానని,, బాబాసాహెబ్ జయంతికి సెలవు ఇవ్వకపోతే,, తాను ఉద్యోగానికి రాజీనామా ఇస్తానని, DRDO యాజమాన్యాన్ని బెదిరించడంతో, అతన్నీ DRDO యాజమాన్యం సస్పెండ్ చేసిందట"".. ఆ యువకుడి పెరు "దిన భాన"(ముగ్గురు BAMCEF వ్యవస్థాపకుల్లో ఒకరు).. అతని తరపున All India Federation of Scheduled Caste/Tribes Backward Class & Minorities Employees Welfare Associations, న్యాయ పోరాటానికి దిగింది.. 
         కాన్షిరం గారిలో ఉత్సుకత మొదలైనది,, ఒక వ్యక్తి పుట్టిన రోజు సెలవు కోసం ఇంత పెద్ద ఉద్యమమా,, అసలు ఎవరు ఈ బాబాసాహెబ్ అనే సందేహం మనసుని తొలిచివేయసాగింది.. తాను ఆ మహా ఉద్యమంలో పాల్గొనాలని బలంగా అనిపించింది.. చిన్నప్పటి నుండి ఏ పని చేసినా,, 100% నిబద్ధతతో నిజాయితీగా చేయడం తన తండ్రి దగ్గర నుండి నేర్చుకున్న కాన్షిరాం,, ఆ ఉద్యమంలో పని చేయడం మొదలెట్టారు.. ఆ క్రమంలో ఒక మహార్ బౌద్ధ యువకుడు, కాన్షిరాం లోని కసి, సంకల్ప బలాన్ని గుర్తించి, అతనికి దగ్గర అయ్యాడు.. అతని పేరు,, D. K. కపర్డే (ముగ్గురు BAMCEF వ్యవస్థాపకుల్లో ఒకరు)..
          ఆయన్ని కాన్షిరాం ఉత్సాహంగా బాబాసాహెబ్ గురించి అడగడం మొదలెట్టారు.. ఆయన పుట్టిన రోజు కోసం ఇంత పెద్ద ఉద్యమం చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని అడిగారు. కపర్డే నవ్వుతూ చెప్పారు,, ""ఆయన ఆధ్యాత్మిక గురువు కాదు,, ఆయన పూర్తి పేరు బాబాసాహెబ్ అంబెడ్కర్,, నువ్వు నేను ఇక్కడ ఉన్న వీళ్ళందరూ, ఇక్కడ ఉద్యోగం చేయడమే కాదు,, హుందాగా రోడ్డు మీద నడుస్తున్నాం అంటే, మంచి బట్టలు వేసుకుని, గౌరవప్రదమైన జీవితాలు గడుపుతున్నాం అంటే అది ఆయన ఇచ్చిన బిక్షే"" అని చెప్పసాగారు..
           అప్పటిదాకా దళితులకు రిజర్వేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, దళితులకు హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ,, అంటరానితనం నిర్ములనకు హరిజనోద్ధరణ చేసింది గాంధీ,, అని పంజాబ్ లో ప్రచారంలో ఉన్న విషయాలనే నమ్ముతూ,, కాంగ్రెస్ పార్టీ అభిమానిగా ఉన్న కాన్షిరాం లో, మరింత అలజడి మొదలైంది.. బాబాసాహెబ్ అంబెడ్కర్ గురించి మరింతగా తెలుసుకోవాలనే ఉత్సాహం కలిగింది కాన్షిరాం గారికి.. దాని గమనించిన కపర్డే గారు కాన్షిరాం కు, బాబాసాహెబ్ రాసిన ఒక పుస్తకం బహుమతిగా ఇచ్చారు.. దాన్ని పేరు "కుల నిర్ములన" (Annihilation of Caste) Every BAMCEF Cadre should read this Book.

మొదట్లో దాన్నీ ఒక మాములు పుస్తకంగా భావించి పేజీలు తిప్పిన కాన్షిరాం గారికి ఏమి అర్థం కాలేదు.. తరువాత రోజు ఆఫీసులో అదే విషయాన్ని దిన భాన, కపర్డే లతో చెప్పారు కాన్షిరాం.. వాళ్ళు దాని చారిత్రక నేపథ్యం చెప్పసాగారు.. నిజానికి అది పుస్తకం కాదు అని,, అది ఒక ప్రసంగంలోని పాఠం అని,, "జాత్ పాత్ తొడక్ మండల్" అనే ఒక హేతువాద సామ్యవాద సంఘం వాళ్ళు, బాబాసాహెబ్ ను ఒక సమావేశానికి ఆహ్వానిస్తే, దానికోసం తయారు చేసుకున్న ప్రసంగం అని,, అది ముందుగా వాళ్లకు పంపిస్తే, వాళ్ళు, ఇందులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే, కొన్ని సామాజిక వర్గాల మనోభావాలు దెబ్బ తింటాయి అని, సమాజంలో అలజడి రేజ్ ప్రమాదం ఉంది అని సాకులు చెబుతూ, కొన్ని లైన్లు తొలగించి ప్రసంగించాలని, బాబాసాహెబ్ ను కోరడంతో,, బాబాసాహెబ్, అందులో ఒక్క లైన్ కాదు కదా,, ఒక్క కామా కూడా మార్చను అంటూ, ఆ సమావేశాన్ని బహిష్కరించి, ఆ ప్రసంగాన్ని ఒక పుస్తకం రూపంలో అచ్చు వేయించారు"" అని చెప్పారు..

       ఆ రోజు రాత్రి అంతా మేలుకొని, ఆ పుస్తకాన్ని, 3 సార్లు చదివారు కాన్షిరాం.. తాను చూసిన సమాజమే,, తనకు ఎదురైన పరిస్థితులే,, కానీ,, తాను ఎప్పుడు ఆలోచించని రీతిలో,, అసలు తన ఆలోచనకే అందని రీతిలో, ఒక క్రమబద్ధంగా పేర్చి, తన ఎన్నో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు కళ్ళకు కట్టినట్టు అనిపించింది.. చదివినంత సేపు రోమాలు నిక్కబొడుచుకుంటూనే ఉన్నాయి,, శరీరాన్ని ఎదో కొత్త శక్తి ఆవరించినట్లు అనిపించింది.. ఎదో సాధించాలి,, ఎదో మార్పు తీసుకురావాలి,, ఈ సమాజానికి ఎదో చేయాలి అని మనసు పరితపించడం మొదలైంది,, 

       తరువాత రోజు దిన భాన, కపర్డే దగ్గర ఉన్న మరిన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ కు సంబంధించిన పుస్తకాలు తెచ్చుకుని,, 24 రోజులు సెలవులు పెట్టి చదివారు కాన్షిరాం.. ఈ 24 రోజుల్లో, కొన్ని రోజులు రోజంతా కన్నీళ్లతో ఏడుస్తూ గడిపాడు,, కొన్ని రోజులు అన్నం కూడా తినకుండా చదువుతూ గడిపాడు,, 24 వ రోజున తన తల్లికి ఒక ఉత్తరం రాసారు కాన్షిరాం..

      అమ్మా.. నేను ఇవాళ ఒక మహా వ్యక్తి గురించి తెలుసుకున్నాను.. అంటరాని ప్రజల భవిష్యత్తుకోసం, పీడిత జాతి ముందడుగు కోసం, తన భార్య, నలుగురు పసి పిల్లలు ప్రాణాలు పణంగా పెట్టి, తన జీవితాన్ని ధారపోసిన ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబెడ్కర్ దారిలో నేను నడవాలి అని నిర్ణయించుకున్నాను.. అమ్మా,, ఇక నాకు పెళ్లి సంబంధాలు వెతకడం మానెయ్యి,, నాకు సంపాదనతో ఆస్తులు కూడబెట్టాలి అనే ఆలోచన లేదు,, నా జీవితం, నా సమయం, నా శక్తీ, నా యుక్తి ద్వారా సాధించిన ప్రతి ఫలం, బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్దేశించిన లక్ష్యాల కోసమే నేను ఉపయోగిస్తాను అని నేను నిర్ణయం తీసుకున్నాను.. అమ్మ, ఇకపైన నేను నిన్ను చూడడానికి, మన ఇంటికి కూడా రాకపోవచ్చు,, నీ మనసుకు క్షోభ కలిగిస్తున్నందుకు నన్ను క్షమించి అమ్మ.
ఇది ఆ లేఖ సారాంశం...

 కాన్షీరామే లేకపోతే ఈ దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనారిటీలకు రాజకీయం అనే మాటే తెలీదు చెంచాగిరి చేయడం తప్ప.
- కాన్షీరాం లేకపోతే అంబేడ్కర్ కు భారతరత్న ఇచ్చేవారే కాదు.

చరిత్రలో మానవులుగా మనుషులతో మన సమాన హక్కుల కోసం పోరాడిన సాధించిన పూలే అంబేడ్కర్, పెరియార్ లాంటి మహానుభావుల ఫోటోలు పెట్టుకొని దేశమంతా పిచ్చివాడిలా తిరిగిన యోధుడు.

రాజకీయరంగంలో చెంచాలుగా మాత్రమే ఉన్న ఎస్సీ, ఎస్టీ,లకు, ఉనికే లేని బీసీలకు మైనారిటీలకు ఒక బీఎస్పీ పార్టీ ఏర్పాటు చేసి వారిని మొట్టమొదటిసారిగా సొంత కాళ్లపై అసెంబ్లీ పార్లమెంట్ మెట్లు ఎక్కించిన వీరాధివీరుడు.

మీరు(దళితులు) పాలక సమాజంగా మారనంతకాలం అవమానించబడుతూనే ఉంటారు అని భవిష్యత్ తరాలను హెచ్చరించిన యోధుడు మన్యవర్ కాన్షీరాం గారు.

Sunday, July 17, 2022

భారత దేశంలోని రాజకీయ పార్టీలు


మనదేశంలో స్వాతంత్య్రానికి పూర్వమే రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి. 1885 లో కాంగ్రెస్‌ స్థాపనతో మన దేశంలో రాజకీయ పార్టీలు ఏర్పడి పనిచేయడం ప్రారంభించాయి. మొదటి దశలో కాంగ్రెస్‌ రాజకీయ పార్టీగా కాకుండా ఒక ఉద్యమంగా ఉండేది. 1920 కి పూర్వం దేశంలో రాజకీయపరమైన పార్టీలు లేవనే చెప్పవచ్చు. 1919లో మాంటేగ్‌ చేమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల ఆధారంగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన స్వరాజ్య పార్టీ కాని, ఎన్నికలను బహిష్కరించిన కాంగ్రెస్‌ పార్టీ కాని ఈనాటి పార్టీల స్వభావం కలిగిలేవు. భారత జాతీయ కాంగ్రెస్‌తో పాటు ముస్లిమ్‌ లీగ్‌, హిందూ మహాసభ, భారత కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీలు స్వాతంత్య్రానికి ముందే స్థాపించబడ్డాయి. స్వాతంత్య్రానంతరం అనేక నూతన పార్టీలు ఉద్భవించాయి.

భారత రాజకీయ పార్టీలను స్థూలంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలుగా వర్గీకరించవచ్చు.

జాతీయపార్టీగా గుర్తింపు పొందుటకు కావల్సిన అర్హతలు:

1. లోక్‌సభ ఎన్నికలలో లేదా రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోలై చెల్లిన ఓట్లలో 6% పొందాలి. ఈ ఓట్లు అనేవి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో పొంది ఉండాలి.
పై వాటితో పాటు లోక్‌సభ ఎన్నికలలో కనీసం 4 స్థానాలను ఒక రాష్ట్రం నుంచి కాని అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో గెలుపొందాలి.
(లేదా)
2. లోక్‌సభ ఎన్నికలలో కనీసం 2% సీట్లను మూడు భిన్న రాష్ట్రాల నుంచి గెలుపొందాలి.
(లేదా)
3. ఒక పార్టీ నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీగా గెలుపొందాలి.

ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి అంటే

1. ఎ) లోక్‌సభ లేదా రాష్ట్ర శాసన సభ ఎన్నికలలో పోలై చెల్లిన ఓట్లలో 6% ఓట్లను ఆ రాష్ట్రంలో పొందాలి.
బి) ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కనీసం రెండు స్థానాలను గెలుపొందాలి. లేదా ఒక లోక్‌సభ స్థానాన్ని గెలుపొందాలి.
(లేదా)
2. ఆ రాష్ట్ర శాసన సభకు జరిగిన ఎన్నికలలో 3% సీట్లను లేదా మూడు సీట్లను గాని గెలుపొందాలి. (ఏది ఎక్కువ అయితే అది).
(లేదా)
3. రాష్ట్రంలోని ప్రతి 25 లోక్‌సభ స్థానాలకు ఒక స్థానాన్ని గెలుపొందాలి.

మెజారిటీ పార్టీకి పరిపాలించే అధికారం ఉన్నట్లే ప్రతిపక్షాలకు అధికార పార్టీ లోటుపాట్లను ఎత్తిచూపి, దాని విధానాలను వ్యతిరేకించి, అధికార పీఠం నుంచి దాన్ని పడగొట్టే హక్కు ఉంటుంది. అధికార పక్షం లోపాలను బహిర్గతం చేసి ప్రజా బాహుళ్యానికి తెలియపరచడంలో ప్రతిపక్షాలు కీలకపాత్రను నిర్వహిస్తాయి.

గేబ్రియల్‌ ఆల్‌మండ్‌ చెప్పినట్లు “రాజకీయ పార్టీలు ప్రయోజనాన్ని సమీకరించే సంస్థలుగా, ప్రజాభిప్రాయానికి మెరుగులు దిద్దే సంస్థలుగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజల తీర్పును కోరే సంస్థలుగాను పనిచేస్తాయి”.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుండి భారత దేశాన్ని ఏ సామాజిక వర్గం పాలించింది అనేది తెలుసుకుందాం.

1 = 1947 జవహర్‌లాల్ నెహ్రూ (బ్రాహ్మణ)
2 = 1964 గుల్జారిలాల్ నందా(బ్రాహ్మణ)
3 = 1964 లాల్ బహదూర్ శాస్త్రి(బ్రాహ్మణ)
4 = 1966 గుల్జారిలాల్ నందా(బ్రాహ్మణ)
5 = 1966 ఇందిరా గాంధీ(బ్రాహ్మణ)
6 = 1977 మొరార్జీ దేశాయ్(బ్రాహ్మణ)
7 = 1979 చరణ్ సింగ్(బ్రాహ్మణ)
8 = 1980 ఇందిరా గాంధీ(బ్రాహ్మణ)
9 = 1984 రాజీవ్ గాంధీ(బ్రాహ్మణ)
10 = 1989 విశ్వనాథ్ ప్రతాప్ సింగ్(బ్రాహ్మణ)
11 = 1990 చంద్రశేఖర్(బ్రాహ్మణ)
12 = 1991 పివి నరసింహారావు(బ్రాహ్మణ)
13 = అటల్ బిహారీ వాజ్‌పేయి(బ్రాహ్మణ)
14 = 1996 ఎ. డి. దేవేగౌడ(ఒబిసి)
15 = 1997 ఐకె గుజ్రాల్(బ్రాహ్మణ)
16 = 1998 అటల్ బిహారీ వాజ్‌పేయి(బ్రాహ్మణ)
17 = 2004 డాక్టర్ మన్మోహన్ సింగ్(సిక్కు)
18 = 2014 నుండి నరేంద్ర మోడీ(బిసీ ముసుగులో ఉన్న వైశ్యా)

భారతదేశంలో నూటికి 50 శాతం పైగా ఒబిసిలున్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కలిసి 35 లేదా 45 శాతం ఉంటారు. మరి మూడు శాతం కూడా లేని బ్రాహ్మణులు ప్రధానమంత్రులు ఎందుకు అవుతున్నారు. కారణం మన దేశంలో రాజకీయ పార్టీల తరపున ప్రధానమంత్రి నామినేట్ చేయబడతారు. జాతీయ పార్టీల నుంచి ప్రధానమంత్రులు అవుతున్నారు. జాతీయ పార్టీలన్నీ బ్రాహ్మణ, బనియా(వైశ్యా), క్షత్రియుల కోసం ఏర్పాటు చేసుకున్నవేనన్న నిజాన్ని నూటికి తొంబై శాతం జనాభా గల ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీలు తెలుసుకోలేక పోతోన్నారు. బ్రాహ్మణ పార్టీలకే ఓట్లు వేస్తోన్నారు. కాంగ్రెస్ పార్టీ , బిజెపి, తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఇవన్నీ బ్రాహ్మణులు తమ మనువాద సిద్ధాంతాలకు ఎక్కడ భంగం కలుగుతుందోననే భయంతో, ముందు జాగ్రత్తగా తమ మనుగడ కోసం చైతన్యంతో ఏర్పాటు చేసుకున్నవే ఈ జాతీయ పార్టీలు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు గత 60 సంవత్సరాలుగా.

రెడ్డి (33-38years)
B. గోపాల "రెడ్డి"----1.5 years
N. సంజీవ "రెడ్డి" ----6 years
K. బ్రహ్మానంద "రెడ్డి" ---7.5 years
M. చెన్నా "రెడ్డి" ---3.5 years
B. వెంకటరామ "రెడ్డి" --7 months
K. విజయభాస్కర్ "రెడ్డి" -- 2.5 years
N. జనార్ధన్ "రెడ్డి" --2 years
YS. రాజశేఖర "రెడ్డి" -- 5.4years
N. కిరణ్ కుమార్ "రెడ్డి" --3.4 years
YS. జగన్మోహన్ "రెడ్డి"--ప్రస్తుతం

కమ్మ (20years)
N. రామారావు--6years
N. భాస్కర్ రావు--1 month
N. చంద్రబాబు నాయుడు---14years

బ్రాహ్మణ (3.5years)
T. ప్రకాశం ---1year
PV. నరసింహారావు---1.4years

D. సంజీవయ్య---2years(దళిత)
T. అంజయ్య---1.3years(రెడ్డి)
జలగం వెంగలరావు---4.3years(వెలమ)
K. రోశయ్య---1year( vysshya)

తెలంగాణ ముఖ్యమంత్రి : కెసిఆర్ (వెలమ)
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు .

మిత్రులారా ఈ దేశ రాజకీయ ముఖచిత్రం బ్రాహ్మణీయ కుల వ్యవస్థ రూపొందించిన విధంగానే నడుస్తుంది అనడానికి ఇవే ఉదాహరణలు...

ఇవన్నీ చూస్తే ఆ మహనీయుడు ఎందుకు “Political Power is the Master Key…”అన్నాడో మాన్యవర్ కాన్షిరాం గారు ఆ power కోసం జీవితాన్ని ఎందుకు త్యాగం చేసాడో ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అర్థమవుతుంది..

బాబాసాహెబ్ రాజకీయోద్యమం

బాబాసాహెబ్ తన 29 వ ఏటనే ఒక రాజకీయ నాయకునిగా emerge కావడం జరిగింది . 

   1920 నుండి 1935 వరకు సాధారణ స్థాయి ఉద్యమం
   సామాజిక, రాజకీయ అంశాలకు ప్రాధాన్యత
   అంటరాని/అణగారిన వర్గాలకు స్పృహ కల్పించడం
   చైతన్య పర్చడం , ఐక్యం చేయడం
 బహిష్కృత హితకారిణి సభ ద్వారా కార్యక్రమాలు

సౌత్‌బరో కమిటీ ముందు హాజరై ఒక విశాల ప్రాతిపదిక పై మూడు ముఖ్యమైన ప్రతిపాదనలు చేసారు :

1. అంట రాని కులాల పక్షాన తమ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ఎన్నికకాకపోతే, అంటరానితనం నిర్మూలన కాదు. 
2. కౌన్సిళ్లలో అంటరాని కులాల ప్రజాప్రతినిధులు ఆధిపత్య కులాలకు సంబంధిం చిన మెజారిటీ సభ్యులని మించకూడదని, ప్రభుత్వమే అంటారని కులాల నుంచి తగు సమర్థులను ఎంపిక చేయాలని అంబేడ్కర్‌ వాదించారు. 
3. అంటరాని కులాలు రాజకీయంగా ఎదగాలంటే, వారి అభ్యర్థుల్ని వారే ఎన్నుకునే విధానం అమలు చేయాలని అంబేడ్కర్‌ కోరారు.
అంతేకాకుండా, ప్రతి పౌరుడికీ చదువు, సంపద కాకుండా ఓటింగ్‌ హక్కు ఉండాలని వాదించిన తొలి వ్యక్తి కూడా అంబేడ్కరే. అప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించి 34 ఏళ్ళు గడిచినప్పటికీ ఇటువంటి అత్యంత ప్రధానమైన రాజకీయ డిమాండ్‌ను చేసిన పాపాన పోలేదు.
[7/16, 8:28 PM] Arun BHEL buddhist: చత్రపతి సాహూమహారాజ్ ఆర్ధిక సహకారం మూలంగానే డాక్టర్ అంబేర్కర్ 'మూక్‌నాయక్ ప్రత్యేక సంచికను వెలువరించడం జరిగింది. 22 మార్చి 1920లో దక్కన్ అస్పృశ్య సమాజపు సమ్మెళనం జరిగింది. దానీకి అధ్యక్షత డాక్టర్ అంబేద్కర్ వహించగా సాహుమహారాజ్ విశిష్ట అతిథిగా పాల్గొన్నాడు. సాహూజీ తన ప్రసంగంలో డాక్టర్ అంబేద్కర్‌ “మేదావులకే అలంకార ప్రాయమైనవాడు”. తమ ప్రజానికాన్ని ఉద్దరించడానికి అంకితమైన నిబద్దత కలవాడు. మీ నాయకున్ని మీరే వెతికిపట్టుకున్నారు. అందుకోసం మీక్కూడా ధన్యవాదాలు చెబుతున్నాను. మీ అభ్యున్నతి కోసం ఎల్లవేళలా కేవలం అంబేద్కరే కృషి చేస్తాడనే విశ్వాసం నాకు కలుగుతోంది. అంతేకాదు ఒకనాడు ఏదో సమయంలో అంబేద్కర్ అఖిలభారత నాయకుడవుతాడనే నమ్మకం నాకుంది. మీరంతా ఈ నాయకుడిని అనుసరించండని ఆదేశించడంతో కరతాళద్వనులతో ప్రజలంతా స్వాగతించారు. సాహూజీ భవిష్యవాణిని పలికి రాబోయో కాలంలో జరిగిన చరిత్రను కళ్లముందు చూపించాడు.

సైమన్ కమిషన్ : 

1927 వ సంవత్సరములో భారత దేశములోని అణచివేయబడ్డ ప్రజల తరగతి యొక్క స్థితిగతుల అధ్యయనము కోసమని సైమన్ గారి అధ్యక్షతలో ఒక కమీషన్ ను నియమించింది ఆంగ్లేయ ప్రభుత్వము. సైమన్ గారు స్వయాన అవిభక్త భారత దేశములోని లాహోర్ చేరుకున్నప్పుడు, కాంగ్రెస్ మరియు గాంధీ  అనుచరులు దేశము మొత్తములో అన్ని చోట్ల సైమన్ గారికి వ్యతిరేక ప్రదర్శనలు జరుపబడ్డాయి. లాహోర్ లో సైమన్ గారికి నల్ల జెండాలు చూపెడుతూ "సైమన్ వెనక్కి వెళ్ళిపో" అంటూ నినాదాలు ఇచ్చారు, ముందుకు సాగనివ్వలేదు. బాబాసాహెబ్ లాహోర్ చేరుకొని 400 పేజీల నిమ్నవర్గాల దీనావస్థలను గురించిన నివేదనా పత్రాన్ని సైమన్ కి సమర్పించారు.  కాంగ్రెస్ పార్టీ వాళ్లేమో సైమంకి నిజానిజాలు తెలవనివ్వకుండా చేసేందుకు, ఆయన కళ్ళలో దుమ్ముకొట్టి మోసము చేసేందుకని కొంతమంది బ్రాహ్మణులతో దళిత బహుజనుల సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసింది. 

(సహపంక్తి భోజనాలలో పాలుగొన్న బ్రాహ్మణులు తరువాత తమ తమ ఇళ్లకు వెళ్లి గోమూత్రాన్ని త్రాగి, దానితో స్నానమాచరించి శుద్ధులవ్వడానికి ప్రయత్నించారు)

సౌత్ బొరో కమిటీ ప్రణాలికలను పూర్తి చేయటానికి అంటే ప్రజా స్వామ్య పరిపాలన నెలకొల్పడానికి 1928 లో సైమన్ కమిషన్ ఏర్పాటు చేశారు.

అంటే సైమన్ కమిషన్ మూలనివాసులకి (OBC, SC, ST) అందరితో సమానంగా అధికారాలు ఇవ్వటానికి భారత దేశం బయలుదేరింది.  దీనిని వ్యతిరేకిస్తూ గాంధీ సైమన్ గో బ్యాక్ అంటూ నినాదం లేపాడు, దీని అర్థం మూలనివాసులకి (OBC, SC, ST) మా తో సమానంగా అధికారాలు ఇవ్వటానికి మేము ఒప్పుకోము అని చెప్పటం. అంటే గాంధీ బ్రాహ్మణులకు మాత్రమే అధికారం ఉండాలి, శూద్రులకు (OBC, SC, ST) అధికారం ఇవ్వటానికి ఇష్టం లేదు, అంటే గాంధీ ఉద్దేశ్యం బానిసలు బానిసలుగా నే ఉండాలి .....

మన స్కూల్ పుస్తకాలలో మాత్రం సైమన్ గో బ్యాక్ అనేది స్వాతంత్ర్య పోరాటం కోసం గాంధీ చేసిన ఉద్యమం గా రాశారు.

ఇప్పుడు బ్రిటిష్ వారు అందరికి అధికారాలు ఇస్తానికి వస్తే, దీనిని బ్రాహ్మణులు మరియు గాంధీ ఎందుకు వ్యతిరేకించారో మనం ఆలోచించాలి. సైమన్ కమీషన్ నిజానికి (OBC, SC, ST, MINORITIES) కి ఉపయోగకరం కాని ఈ విషయాలను మరుగునపెట్టి లేని పోని విషయాలను తప్పుడు ప్రచారం చేశారు గాంధీ మరియు బ్రాహ్మణులు, వారు స్దాపించిన మీడియా ద్వారా. మీడియా లో వచ్చే ఈ ప్రచారాలు నమ్మి చాలా మంది గాంధీ వెనకాల వెళ్ళారు, అప్పటికే సత్య సోదక్ సమాజ్ ను కూల్చి OBC లను కాంగ్రెస్ లో కలిపేసుకున్నారు బ్రాహ్మణులు, చాలా వరకు మన అమాయకపు మూలనివాసులు ఈ తప్పుడు ప్రచారం నమ్మేశారు. 

బ్రిటిష్ వారికి కూడా చాలా కోపం వచ్చింది, మీ కోసం మేము వస్తే మా మీదే తప్పుడు ప్రచారం చేస్తారా? అని భారతీయ ప్రతినిధులనే వారి దగ్గరకు లండన్ రమ్మన్నారు...అవే 1930 - 1932 లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలు


రౌండ్ టేబుల్ సమావేశాలు :

రౌండ్ టేబుల్ సమావేశాలకు నామినేషన్లు సమర్పించినవారు వెళ్ళారు.  గాంధీ వెళ్ళలేదు, ఎందుకంటే ఆయన చేసిన సైమన్ గో బ్యాక్, విజయవంతం అయ్యిందనుకున్నాడు. ముస్లిం లీగ్ ప్రతినిధి అయిన జిన్నా కూడా మొదటి, రెండవ  రౌండ్ టేబుల్  సమావేశాలు మాత్రమె హాజరయ్యారు. రౌండ్ టేబుల్ సమావేశాలు మొదలైనప్పుడు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు తన యొక్క ప్రతిపాదనలు బ్రిటిష్ వారి ముందు ఉంచాడు.

ఆ ప్రతిపాదనలలో ముఖ్యమైనవి
1) Adult franchise (యుక్త వయస్సు వచ్చిన అందరికీ ఓటు హక్కు)
2) Adequate representation (జనాభా ప్రాతిపదికన సరిపడేంత ప్రాతినిధ్యం)
3) Separate electoral (ప్రత్యేక ఎన్నికలు)
4) Dual voting (రెండు ఓట్లు)
అన్ని వాదోపవాదాలు విని చర్చించిన తరువాత, బ్రిటిష్ వారు ఇవన్నీ సమంజసంగా ప్రజాస్వామ్య రీతిలో అందరికి సమానంగా ఉన్నాయని గ్రహించి కమ్యూనల్ అవార్డ్స్ అన్న పేరుతో డా: అంబేద్కర్ గారి ప్రతిపాదనలను ఆమోదించింది. అందరూ (OBC, SC, ST &MINORITIES) సంతోషించారు, ఎందుకంటే అందరికి సమాంతరంగా తమ ప్రతినిధులను తమ యొక్క సమస్యలను పార్లమెంటు లో విన్నవించుకునే అవకాసం కలిగింది.

అందరూ ఆనందిస్తుంటే, ఒక్కరు అడ్డుకున్నారు. ఆయనే మోహన్ దాస్ కరం చంద్ గాంధీ...
అదే పూనా ఒప్పందం రూపంలో నిజమైన బహుజన రాజకీయ ప్రాతినిద్యానికి గొడ్డలి పెట్టు.  పూనా ఒప్పందం ప్రాజాస్వామ్యానికి చావు దెబ్బ, అది బ్రాహ్మణులు మరియు గాంధీ కలిసి పన్నిన పన్నాగం.


(పూనా పాక్ట్ గురించి, బాబాసాహెబ్ రాజకీయ పోరాటం గురించి మరింత సమాచారం ముందు తరగతుల్లో చూద్దాం...)

Friday, July 15, 2022

E. ఆత్మగౌరవ ఉద్యమ పితమహులు: పెరియర్ EV రామస్వామి

ఆత్మగౌరవ నినాదం పెరియార్:                            

 'పెరియార్’ (పెద్దాయన) అని ప్రజల చేత ప్రేమగా పిలిపించుకున్న యి.వి. రామస్వామి నాయకర్( 1879-1973) దక్షిణాది రాస్ట్రాలలో గత శతాబ్దంలో జరిగిన అనేక ప్రత్యామ్నాయ వుద్యమాలకు చిరునామా.  సామాజిక దుర్నీతిపైన, కులతత్వ రాజకీయాలపైన, మతం తాలూకు మూఢ విశ్వాసాల పైన, సాంస్కృతిక విలువలపైన తన జీవిత కాలమంతా రాజీలేని పోరాటం చేసిన ఆయన దళిత బహుజనులకు నిజంగానే పెద్ద దిక్కుగా మిగిలాడు. రాజకీయ స్వాభిమానం, సాంఘిక స్వాభిమానం రెండూ చెట్టపట్టాలేసుకుని సాగుతాయని నమ్మిన పెరియార్ తన పోరాటాన్ని రాజకీయ రంగంతో పాటు సామాజిక, సాంస్కృతిక  రంగాలకు కూడా విస్తరింపజేశాడు.   
పెరియార్ 1919లో అప్పటి జాతీయ కాంగ్రెస్ లో చేరినప్పటికీ అతి కొద్దికాలంలోనే దాని పట్ల తన భ్రమలను తొలగించుకున్నాడు. 

కాంగ్రెస్ గొప్పగా చెప్పుకొనే జాతీయవాదం వొక మేడిపండు వంటిదని, దానినిండా కులతత్వ లుకలుకలు వున్నాయని జాతీయ కాంగ్రెస్ గుట్టు రట్టు చేసిన ధీశాలి పెరియార్. పుట్టుక ఆధారంగా కొందరిపైన వివక్షను కొనసాగించే వర్ణాశ్రమ ధర్మం లేని జాతీయవాదం కావాలని పెరియార్ జతీయవద భావనకు తనదైన వ్యాఖ్యానాన్నిచ్చాడు. అణగారిన కులాలలో బ్రాహ్మణేతర ద్రవిడ వుద్యమ స్పూర్తిని నింపడంలో పెరియార్ ఎన్నో మైలురాళ్ళను దాటాడు. ద్రవిడ వుద్యమం అంటే కేవలం తమిళులకు మాత్రమే పరిమితమైనది కాదని, ఆర్యేతరులంతా ద్రావిడులేనని, దురాక్రమదారులైన ఆర్యుల ఆధిపత్య భావజాలాన్ని వ్యతిరేకించే అణగారిన వర్గాలకు చెందిన దేశవ్యాప్త వుద్యమమని పెరియార్ ద్రావిడ సిద్ధాంతానికి అంబేడ్కర్ వో  విశాలమైన దృక్పధాన్ని అందించాడు. తనకు ఎంతో భావసారూప్యత గల పెరియార్ ను అంబేడ్కర్ 1944 లో కలుసుకున్నాడు. కాంగ్రెస్ మరియు గాంధీల హరిజనోధరణలోని డొల్లతనాన్ని అంబేడ్కర్ , పెరియార్ లు తమవైన పద్ధతులలో యెండగట్టారు.     

పెరియార్ కాంగెస్ పార్టీని విడిచి పెట్టాక తమిళనాడులోని బ్రాహ్మణేతర దళిత బహుజనులను సంఘటితం చేస్తూ పెద్ద యెత్తున వుద్యమాన్ని నిర్మించాడు. తన వుద్యమంలో యువకులను, స్త్రీలను క్రియాశీలక పాత్రధారులను చేశాడు. ఆయన నిర్వహించిన వుద్యమాలలో వైకోం పోరాటం ముఖ్యమైంది. ఆయన పూర్వీకుడు, తమిళ సామాజిక వుద్యమాలకు ఆద్యుడైన అయోతీదాస్ మీద గౌరవంతో  అయోతీదాస్ క్రియాశీలకంగా పనిచేసిన కోలార్  బంగారు గనుల ప్రాంతం నుంచి పెరియార్ తన కార్యక్రమాలను ప్రారంభించడం విశేషం.  అయోతీదాస్ అనుచరులలో అప్పాదురై,లక్ష్మీ నరుసులు పెరియార్ తో పాటు పనిచేశారు. పెరియార్ కి  హైందవేతర మతాలైన బౌద్ధం, యిస్లాం పట్ల గౌరవం వున్నప్పటికీ ఆయన నాస్తికుడిగానే గుర్తింపు పొందాడు. 
పెరియార్ కి సోషలిజం పట్ల కూడా ఎంతో అభిమానం  వుంది. అయితే ఆయన దాన్ని భారతీయ సామాజిక వాస్తవికతతో మాత్రమే ముడిపెట్టి చూడడం గమనార్హం. ఆయన నిర్మించిన బ్రాహ్మణేతర వుద్యమం రాజకీయంగా జస్టిస్ పార్టీ గా రూపొందింది. జస్టిస్ పార్టీ సోషలిస్ట్ సిద్ధాంత ప్రాతిపదికగా కింది  కులాలు పోగొట్టుకున్న యెన్నో అవకాశాలను తిరిగి యిచ్చింది. క్రమంగా యీ పార్టీ ‘ద్రవిడ కజగం’ గానూ, అన్నాదురై అనంతరం ‘ద్రవిడ మున్నేట్ర కజగం’ గానూ పరిణామం చెందింది. పెరియార్ తన భావాల వ్యాప్తి కొరకు 'కుడి అరసు’ అనే పత్రికను ఏర్పాటు చేసి దానిలో ఎన్నో సంచలనాత్మక సంపాదకీయాలను, వ్యాసాలను ప్రచురించాడు. ఆయన అనేక గ్రంధాలు కూడా రచించి ద్రావిడ సిద్ధాంతాన్ని ముందుకు తీసికెళ్ళాడు. భాషా పరంగా హిందీ భాషను ద్రవిడులపైన రుద్దడాన్ని పెరియార్ వ్యతిరేకించాడు.     

పెరియార్ వో వైపు రాజకీయ పోరాటం చేస్తూ శూద్రులకు ఎన్నో అవకాశాలను, హక్కులను కల్పిస్తూనే మరోవైపు స్త్రీల పరంగా సంస్కణోద్యమాన్ని కొనసాగించాడు. ఆయన బ్రాహ్మణవాదం యే  రూపంలో వున్నా దాన్ని యెదుర్కొని  సమాజం సమూలంగా మార్పు చెందాలని భావించాడు. స్త్రీని వొకపక్క దేవతగా పూజించే హిందూమతం మరోపక్క ఆమెను దేవదాసిగా, వూరుమ్మడి వస్తువుగా దిగజార్చిందని హిందూ మతం యొక్క రెండు నాల్కల ధోరణిని ఎండగట్టాడు. స్త్రీకి ఆస్తి హక్కు, గర్భ నిరోధక హక్కు, జీవిత భాగస్వామిని ఎన్నుకునే స్వేచ్చ వుండాలని పెరియార్ వాదించాడు. వివాహ వ్యవస్థలో వున్న లొసుగులను చీల్చి చెండాడడమే కాకుండా ప్రజల వ్యక్తిత్వాలను గౌరవించే పెళ్ళిళ్ళు జరగాలని ప్రతిపాదించాడు. తాళిబొట్టు, కట్నకానుకలు, కులమతాలకు సంబంధం లేని వివాహాలను పెరియార్ తానే స్వయంగా నిర్వహించాడు. భూమి వొక ఆస్థిగా భావించని, దానిపై ప్రజలకు వ్యతిగత హక్కులులేని కాలంలో స్త్రీలపైన అణచివేత, బానిసత్వం, బలవంతపు వివాహాలు లేవని ఆయన అభిప్రాయం. స్త్రీలు, కుటుంబం, వ్యక్తిగత ఆస్థి వంటి అంశాలలో పెరియార్ ఆలోచనలు యెంగెల్స్,  అంబేడ్కర్ ఆలోచనలకు దగ్గరగానూ, ఆయన బ్రాహ్మణేతర దృక్పధం  ఫూలే దృక్పధానికీ దగ్గరగా అనిపిస్తాయి. ఆనాటి స్త్రీవిద్య స్త్రీలను మంచి వంటగత్తెలుగానూ, కుట్టు పనులు నేర్చుకునేవారిగానూ వెరసి 'మంచిభర్త’ కోసం ఏర్పాటు చేయబడినట్టుగానూ వుందని పెరియార్ వ్యంగ్యంగా పేర్కొనడం విశేషం. ఆయన అభిప్రాయాలు  యీ నాటి సమాజానికీ వర్తిస్తాయి.    

పెరియార్ నిర్మించిన స్వయంగౌరవ వుద్యమమం దక్షిణాదిన భాగ్యరెడ్డి వర్మ నాయకత్వంలో ఆది ఆంధ్ర వుద్యమానికి, ఆది కర్నాటక వుద్యమానికి ప్రేరణగా నిలిచింది. మైసూర్ లోని వొక్కలిగలు, లింగాయతులు, ముస్లింలు, కురుబలు తమకోసం సంఘాలు ఏర్పాటు చేసుకుని అస్థిత్వ పోరాటాలు ప్రారంభించడానికి పెరియార్ వుద్యమం దోహద పడిందనవచ్చు. పెరియార్ అనుచరులు బ్రాహ్మణేతర భావజాల చిహ్నాలను చెప్పులతో కొట్టి, దేవాలయాలను బహిష్కరించి, మనుస్మృతి  వంటి గ్రంధాలను తగలబెట్టేవారు. అయితే యీ వుద్యమం వలన చైతన్యవంతమైన శూద్ర బహుజన కులాలవారు ఆర్ధిక పరిపుష్టి పొందాక క్రమంగా బూర్జువా రాజకీయాలకు లోనవడమే కాకుండా దళితులపైన దాడులకు పాల్పడి పెరియార్ స్పూర్తికి దూరమయ్యారు. యీ క్రమం మహారాష్ట్రలోని కున్ బీల విషయంలో కూడా  జరిగింది. 2006 లో జరిగిన ఖైర్లాంజి సంఘటన దీనికి వుదాహరణ. 

తమిళనాడులో ఆర్యదేవతల దేవాలయాలు గాక అనార్య దేవతలు, మాతృదేవతల ఆలయాలే అధికంగా వుండడం వెనుక పెరియార్ వంటి ద్రావిడ వుద్యమకారుల ప్రభావం వుందనే చెప్పాలి. సమాజంలోని సమస్తమైన  రుగ్మతలు, ఆధిపత్య భావజాలానికి ప్రతీకలైన సంప్రదాయాలు సమూలంగా మారాలని భావించిన పెరియార్ తాను నమ్మిన సిద్ధాంతాన్ని అమలు పరచడానికి తన ఆస్థిని, సౌఖ్యాన్ని వదులుకొని సామాన్య జీవితాన్ని గడిపాడు. తన ప్రజలకు సామాజిక న్యాయం నిరాకరించే సమాజం ఆర్ధిక, రాజకీయ సమానత్వం కోసం పోరాడే శక్తిగల నాయకులను సృష్టించలేదని ఆయన భావన. ఆధిపత్య భావజాలం యెక్కడున్నా దానిని ప్రశ్నించి తీరాలన్న పెరియార్ ఆత్మగౌరవ వుద్యమాలకు 'పెద్దాయన’. ఆయన స్మృతి అణగారిన కులాల అస్థిత్వ పోరాటాలకు నిరంతరం స్పూర్తిదాయకంగా నిలుస్తుంది.


బహుజన హక్కులే మానవ హక్కులని నినదించిన ఈ బహుజనోద్యమకారుని జీవిత చరిత్ర గుర్తుకు చేసుకొని చైతన్య మూర్తులై , బహుజన రాజ్యాన్ని స్థాపిద్దాం ...

C. స్వామి నారాయణ గురు గౌడ్

స్వామి నారాయణ గురు (1855-1928)

మనదేశంలో నూటికి నూరు శాతం అక్షరాస్యతను సాధించిన రాష్ట్రం ఏదైనా వుందంటే అది ఒక్క కేరళ మాత్రమే! స్త్రీ విద్యలో ఆ రాష్ట్రం కమ్యూనిస్టు చైనా కంటే కూడా అగ్రస్థానంలో వుంది. ఇవాళ కేరళ నర్సులు లేని పెద్ద ఆసుపత్రి యావద్దేశంలో ఒక్కటి కూడా వుండదంటే అతిశయోక్తి కాదు. ఈ అద్భుత ప్రగతి వెనక అలనాడు అభ్యుదయ సామాజిక తత్వవేత్త శ్రీ నారాయణ గురు (1855-1928) చేసిన అపూర్వమైన కృషి ఎంతో వుంది.

ఆ రోజుల్లో వెనుకబడిన కులాల వారికి దేవాలయాల్లో ప్రవేశించే అర్హత వుండేదికాదు. దళితులకైతే దేవాలయాల చుట్టుపక్కలి వీధుల్లోకి, రహదార్లపైకి అడుగుపెట్టే అర్హత కూడా లేదు. అంటరానివాళ్ల నీడ సోకితేనే మైల పడతా మన్నట్టు అసహ్యించుకునేవారు బ్రాహ్మణులు. 

నంబూద్రీలు (బ్రాహ్మణులు) దైవాంశ సంభూతులు కాబట్టి వారు మాత్రమే దేవాలయంలోని గర్భగుడిలో తిరుగాడవచ్చు. అదే రాజ్యాన్ని పాలించే క్షత్రియులకు సైతం ఆ అర్హత లేదు. వారు గర్భగుడికి కనీసం రెండడుగుల దూరాన్ని పాటించాలి. నాయర్లు 16 అడుగుల దూరం, ఈళవ కులస్తులు 32 అడుగుల దూరం, పులయ మరియు పరయ కులస్థులు 64 అడుగుల దూరం పాటించాలి. ఇక నాయాదీలు (మాల మాదిగ తదితర దళిత కులస్తులు) దేవాలయం సంగతి అటుంచి, బ్రాహ్మణుల కనుచూపు మేరలో కూడా కనిపించకూడదు. పొరపాటున ఏ నాయాదినైనా బ్రాహ్మణుడు చూస్తే అతను ప్రాయశ్చిత్తం చేసుకోవలసి వుండేది. 
ఇవీ ఆనాడు (సవర్ణ) మనిషికీ ... (అవర్ణ) మనిషికీ మధ్య, (మనువాద) దేవాలయానికీ మనిషికీ మధ్య వున్న దూరం నియమాలు. దేవుడి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం వారి కులాలను బట్టి పై దూరాలతో విడివిడిగా క్యూ రైలింగ్‌లుండేవి. అంటే ఉదాహరణకి నాయర్లు దేవుడి విగ్రహాన్ని 16 అడుగుల దూరం నుంచి దర్శనం చేసుకోగలిగితే పులయ, పరయ కులస్థులు 64 అడుగుల దూరం నుంచి నిక్కినిక్కి చూస్తూ అస్పష్టంగా దర్శనం చేసుకోవలసి వచ్చేది. ఇక మాలమాదిగలకైతే ఆ దేవుడు ఎలావుంటాడో చూసే అవకాశమేలేదు. 
ఇంకా ఇట్లాంటి అమానుషమైన, అర్థ రహితమైన నియమ నిబంధనలు అనేకం వుండేవి. (వాటి గురించి ఈ పుస్తకంలో కొంతవరకు వివరంగానే ప్రస్తావించడం జరిగింది). ఈళవ తదితర వెనుకబడిన తరగతులకు చెందినవాళ్లు అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటూ కూడా దేవుడి విగ్రహాన్ని దర్శించుకునేందుకు నానా యాతనా పడేవారు. అగ్రవర్ణాల వారు ఆర్థికంగా బాగుండటానికి, తాము దారిద్య్రంతో కునారిల్లుతుండటానికి కారణం తమపై దైవానుగ్రహం లేకపోవడమే, తమకు దైవ దర్శనభాగ్యం లభించకపోవడమే కారణమని కుమిలి పోయేవారు!
ఈ నేపథ్యంలో ఈళవ కులంలో జన్మించిన శ్రీ నారాయణ గురు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, ఆర్యనీకరణ వల్ల చోటుచేసుకున్న మూఢనమ్మకాలకు, దుస్సంప్రదాయాలకు, ఆచారాలకు, అగ్రవర్ణ దోపిడీపీడనలకు వ్యతిరేకంగా గొప్ప సామాజిక ఉద్యమాన్ని నిర్మించారు. 
వెనుకబడిన కులాల వారికోసం ప్రత్యేకంగా దేవాలయాలను నిర్మించారు. అందులో వెనుకబడిన తరగతుల వారినే పూజారులుగా నియమించారు. 
ఆయన నిర్మించిన దేవాలయాలు అవర్ణులలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మాభిమానాన్ని, ఉత్తేజాన్ని కలిగించాయి. ఆ దేవాలయాలను శ్రీ నారాయణగురు విద్యాలయాలుగా కూడా ఉపయోగిస్తూ వెనుకబడిన తరగతుల వారిలో విద్యావ్యాప్తికి విశేషంగా కృషి చేశారు. 
వివాహాలు, బారసాలలు, చావులు వంటి సందర్భాలలో ఆచారాల పేరిట శక్తికి మించి చేసే ఖర్చులను ఆయన పూర్తిగా రూపుమాపారు. చావులకి, పెళ్లిల్లకి బ్రాహ్మణుల మీద ఆధారపడకుండా, వారు తమను దోపిడీ చేసే అవకాశం లేకుండా చేశారు. ఈ అర్థంలేని ఆచారాల వల్ల అనేక కుటుంబాలు తమ తాహతుకు మించి ఖర్చుచేసి అప్పులపాలవుతుండేవి. ఆయన పుణ్యమాని అవర్ణ సమాజంలో అట్లాంటి వన్నీ మటుమాయమైపోయాయి. ప్రతి ఒక్కరూ విద్య ప్రాధాన్యతను గుర్తించడం ప్రారంభించారు. అంతకుపూర్వం అంటరానివాళ్లకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశార్హత వుండేది కాదు. శ్రీ నారాయణ గురు నిర్మించిన దేవాలయాలే విద్యాలయాలుగా సేవలు అందిస్తుండటంతో వారికి విద్య అందుబాటులోకి వచ్చింది. ఆతరువాత అనేక పాఠశాలలు నెలకొల్పడమే కాక ప్రభుత్వ పాఠశాలల్లో సైతం అంటరానివాళ్లని చేర్చుకోవాలని పోరాడి సాధించారు. దాంతో ఒక్కసారిగా వెనుకబడిన తరగతుల వారి స్థితిగతుల్లో గొప్ప మార్పు చోటుచేసుకుంది. 

సంఘ సంస్కరణకోసం విలక్షణమైన తాత్విక మార్గాన్ని అనుసరించిన శ్రీ నారాయణగురు ప్రభోదాలు అవర్ణులందరికీ శిరోధార్యాలయ్యాయి:
''మనుషులందరికీ ఒకే కులం ... ఒకే మతం ... ఒకే దేవుడు.''
''మతం కోసం మనిషి కాదు. మనిషి కోసం మతం.''
''కులం అడగొద్దు ... కులం చెప్పొద్దు ... కులం గురించి అసలు మాట్లాడనే వద్దు.'' 
''విద్య ద్వారా స్వేచ్ఛ ...సంఘటితమవడం ద్వారా శక్తి ...పరిశ్రమించడం ద్వారా ప్రగతి !'' 
''మతం ఏదైనా గానీ మనిషిని ఎదగనివ్వాలి.''

అంటూ శ్రీ నారాయణ గురు చేసిన ప్రభోదాలు కేరళలోని వెనుకబడిన, దళిత సమాజంలో విప్లవాత్మక మైన మార్పులకు నాంది పలికాయి.

బాబాసాహెబ్ అంబేద్కర్ - సామాజిక ఉద్యమాలు

బాబాసాహెబ్ అంబేద్కర్ -
 సామాజిక ఉద్యమాలు


ఈ రోజు క్లాసు లో మనం నేర్చుకున్న విషయాల పట్ల మరికొంత సమాచారాన్ని ఇక్కడ జతపరుస్తున్నాను.
ఎవరికీ పరిచయం అవసరం లేని వ్యక్తి బాబాసాహెబ్ Dr. Bhimrao Ramji Ambedkar . అయన చదువు కాని ఆయన నవ భారత నిర్మాణంలో చేసిన contribution గాని మనం మర్చిపోలేనిది. 
Simply we can say that “We are Because he Was…”

అయితే ప్రపంచ దేశాలన్నీ బాబాసాహెబ్ యొక్క ఆలోచనా విదానాన్ని ఒక discipline ఒక ఫిలాసఫీ గా గుర్తించినాయి. కాని దురదృష్ట వశాత్తు భారత దేశంలో ఇంకా Ambedkar school of thought అనేది మొదలవలేదు . 

అంబేడ్కర్ మన కొంతమంది దళితుల జీవితాల్లో , మరి కొంతమంది OBC ల జీవితాల్లో మాత్రమే వున్నాడు. చాలా మంది ఇండ్లల్లో బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటం వుంటుంది కాని బాబాసాహెబ్ ఆలోచనా విదానం మన దైనందిన జీవితాల్లో వుండదు. దీన్ని మనం గుర్తించాలి. 

దాదాపు అన్ని forward democratic countries బాబాసాహెబ్ Ideology ని ఒక philosophy గ గుర్తించాయి. కాని భారత దేశంలో మనం ఆయనని ఒక Philosopher గ చూడడం లేదు. ఇంకా ఆయనను ఒక దళితుల నాయకునిగానే చూస్తున్నాము, దళితుల ఓట్లు దండుకోవడానికి మాత్రమె బ్రాహ్మణీయ పార్టీలు ఆయన్ని ఒక పావుగ వాడుకొంటున్నారు (విగ్రహాన్ని కూడా). 
ఈ రోజు అన్ని పార్టీలు కూడా అంబేడ్కర్ జపమే చేస్తున్నాయి. దీనివల్ల అంబేడ్కర్ ఆలోచనా విదానం పై ఒక గందరగోలమైన పరిస్తితులు నెలకొన్నాయి . దీనికంతటికీ కారణం మన దైనందిన జీవితాల్లో బాబాసాహెబ్ లేకపోడం, మనం అప్రమత్తతతో లేకపోవడం. “Remember that it is not enough that a people are numerically in the majority. They must be always watchful, strong and self-respecting to attain and maintain success…” అన్న బాబాసాహెబ్ మాటలను అర్థం చేసుకోపోవడమే...


నేడు మనం ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేని సందిగ్దం లో వున్నాం. మరి మనకు ఆ సందిగ్దత తొలగిపోవాలంటే మన అందరం తప్పనిసరిగా బాబాసాహెబ్ రాసిన volumes (Babasaheb Writings & Speeches) చదవాలి. 

https://www.mea.gov.in/books-writings-of-ambedkar.htm 

మొత్తం 21 volumes వున్నాయి. అవన్నీ చదివి అర్థం చేసుకుంటే బాబాసాహెబ్ మన దైనందిన జీవితాల్లో ఉంటాడు, లేకుంటే బాబాసాహెబ్ యొక్క ఆలోచనా విదానాన్ని ముందుకు తీసుకుపోలెం ...

బాసాహెబ్ అంబేడ్కర్ గారి జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను Chronological order లో present చేయడం జరిగింది. 

1917 సౌత్ బరో కమిటీ ముందు వాంగ్మూలం.
1920 మరాఠీ పక్ష పత్రిక "మూక్ నాయక్" ప్రారంభం.
1924 "బహిష్కృత్ హితకారిని సభ" పేరుతో తన మొట్టమొదటి సామాజిక సంస్తను నెలకొల్పటం.
1925 హిల్టన్ యంగ్ కమీషన్ ముందు వాంగ్మూలం ఇవ్వటం. ఆ వాంగ్మూలమే 1935 లో రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుకు కారణం అయింది. 
1927 బొంబాయి ప్రాదేశిక శాసనమండలి సభ్యునిగా నియామకం.
1927 మహద్ సత్యాగ్రహం.
1927 మనుస్మృతి దహణం.
1927 "భహిష్కృత్ భారత్" పేరిట మారాఠీ పక్ష పత్రిక ప్రారంభం.
1930  మారాఠీ పక్ష పత్రిక "జనత" ప్రారంభం.
1930 నాగపూర్ లో అఖిల "భారత్ అనగారిన వర్గాల సదస్సూ" నిర్వహణ. 
1930 నవంబర్ నుండి 1931 జనవరి వరకు మొదటి రౌండ్ టేబుల్ సదస్సులో పాల్గొనటం.
1931 ఆగస్ట్ లో మహాత్మా గాంధీ తో మొట్టమొదటి సమావేషం.
1931 సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు రెండవ రౌండ్ టేబుల్ సమావేషం.
1932 సెప్టెంబర్ లో కమ్యునల అవార్డుకు వ్యతిరేకంగా గాంధీ నిరాహార దీక్ష, పూనా ఒడంబడిక.
1932 నవంబర్ నుండి డిసెంబర్ వరకు మూడవ రౌండ్ టేబుల్ సమావేషం.
1935 లో హిందూమతాన్ని ఒదిలిపెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించటం. ఈ నిర్ణయం దేశంలో ప్రకంపనలు సృష్టించింది. 
1935 స్వతంత్ర లేభర్ పార్టీ ఏర్పాటు. 
1937 లో ముంబాయ్ ప్రాదేశిక శాసనసభకు జరిగిన ఎన్నికలలో స్వతంత్ర లేభర్ పార్టీ కి చెప్పుకోదగిన విజయం.
1938 లో వర్తక విదానాల బిల్లును వ్యతిరేకించటం. కార్మిక నాయకునిగా గుర్తింపు.
1942 లో షెడ్యూల్డ్ కులాల సమాక్య పేరిట కొత్త పార్టీ.
1945 జులై లో ప్రజా విధ్యా సంఘం పేరుతో విద్యా సంస్తను నెలకొల్పటం.
1946 లో బెంగాల్ నుండి శాసన సభకు ఎన్నిక కావటం.
1947 లో బాంబే నుండి శాసన సభకు తిరిగి ఎన్నిక కావటం.
1947 ఆగస్ట్ లో స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి న్యాయ శాఖా మంత్రిగా నియామకం.
1947 భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అద్యక్షునిగా నియామకం.
1950 భారత రాజ్యాంగం ఆమోదం పొందటం.
1952 లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసి 
1956 ఫిబ్రవరి లో "ప్రభుద్ద్ భారత్" పేరుతో పత్రికను ప్రారంభించటం. 
1956 అక్టోబర్ లో 5 లక్షల మంది అనుచరులతో బౌద్ద మతంలో చేరటం.
1956 డిసెంబర్ 6న మహాపరి నిర్వాణం.
ఓడిపోవటం.
1952 లో రాజ్య సభకు ఎన్నిక కావటం.
[7/15, 12:42 AM] Arun BHEL buddhist: బాసాహెబ్ అంబేడ్కర్ గారి జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను Chronological order లో present చేయడం జరిగింది. 

1917 సౌత్ బరో కమిటీ ముందు వాంగ్మూలం.
1920 మరాఠీ పక్ష పత్రిక "మూక్ నాయక్" ప్రారంభం.
1924 "బహిష్కృత్ హితకారిని సభ" పేరుతో తన మొట్టమొదటి సామాజిక సంస్తను నెలకొల్పటం.
1925 హిల్టన్ యంగ్ కమీషన్ ముందు వాంగ్మూలం ఇవ్వటం. ఆ వాంగ్మూలమే 1935 లో రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుకు కారణం అయింది. 
1927 బొంబాయి ప్రాదేశిక శాసనమండలి సభ్యునిగా నియామకం.
1927 మహద్ సత్యాగ్రహం.
1927 మనుస్మృతి దహణం.
1927 "భహిష్కృత్ భారత్" పేరిట మారాఠీ పక్ష పత్రిక ప్రారంభం.
1930  మారాఠీ పక్ష పత్రిక "జనత" ప్రారంభం.
1930 నాగపూర్ లో అఖిల "భారత్ అనగారిన వర్గాల సదస్సూ" నిర్వహణ. 
1930 నవంబర్ నుండి 1931 జనవరి వరకు మొదటి రౌండ్ టేబుల్ సదస్సులో పాల్గొనటం.
1931 ఆగస్ట్ లో మహాత్మా గాంధీ తో మొట్టమొదటి సమావేషం.
1931 సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు రెండవ రౌండ్ టేబుల్ సమావేషం.
1932 సెప్టెంబర్ లో కమ్యునల అవార్డుకు వ్యతిరేకంగా గాంధీ నిరాహార దీక్ష, పూనా ఒడంబడిక.
1932 నవంబర్ నుండి డిసెంబర్ వరకు మూడవ రౌండ్ టేబుల్ సమావేషం.
1935 లో హిందూమతాన్ని ఒదిలిపెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించటం. ఈ నిర్ణయం దేశంలో ప్రకంపనలు సృష్టించింది. 
1935 స్వతంత్ర లేభర్ పార్టీ ఏర్పాటు. 
1937 లో ముంబాయ్ ప్రాదేశిక శాసనసభకు జరిగిన ఎన్నికలలో స్వతంత్ర లేభర్ పార్టీ కి చెప్పుకోదగిన విజయం.
1938 లో వర్తక విదానాల బిల్లును వ్యతిరేకించటం. కార్మిక నాయకునిగా గుర్తింపు.
1942 లో షెడ్యూల్డ్ కులాల సమాక్య పేరిట కొత్త పార్టీ.
1945 జులై లో ప్రజా విధ్యా సంఘం పేరుతో విద్యా సంస్తను నెలకొల్పటం.
1946 లో బెంగాల్ నుండి శాసన సభకు ఎన్నిక కావటం.
1947 లో బాంబే నుండి శాసన సభకు తిరిగి ఎన్నిక కావటం.
1947 ఆగస్ట్ లో స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి న్యాయ శాఖా మంత్రిగా నియామకం.
1947 భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అద్యక్షునిగా నియామకం.
1950 భారత రాజ్యాంగం ఆమోదం పొందటం.
1952 లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోవటం.
1952 లో రాజ్య సభకు ఎన్నిక కావటం.
1956 ఫిబ్రవరి లో "ప్రభుద్ద్ భారత్" పేరుతో పత్రికను ప్రారంభించటం. 
1956 అక్టోబర్ లో 5 లక్షల మంది అనుచరులతో బౌద్ద మతంలో చేరటం.
1956 డిసెంబర్ 6న మహాపరి నిర్వాణం.

మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమాన్ని రెండు దశలుగా విభజించవచ్చు.

1. సామాజిక ఉద్యమం
2. రాజకీయ ఉద్యమం

సామాజిక ఉద్యమం : 

బాబాసాహెబ్ అంబెడ్కర్ కీలక పోరాట ఘట్టాలను నెమరువేసుకుంటే రోమాలు నిక్కపొడుస్తాయి మహాద్ చెరువు మంచి నీళ్ల పోరాటం, కాలరాం దేవాలయ ప్రవేశ ఉద్యమం, బొంబాయి నూలు మిల్లు కార్మికుల పోరాటం, రాజ్యాంగ రచన కాలంలో ఓ వైపు గాంధీ తో మరోవైపు దేశంలో పెత్తందారుల ఒత్తిడి ని ప్రతిఘటించిన తీరు ఇలాంటి ముఖ్యమైన ఘట్టాలు ప్రతి అవమానం పై ప్రతిఘటన చేసిన ఆయన స్ఫూర్తి నేటి తరం నేర్చుకొని అడుగులు వేయాలి.

మహాద్ చెరువు మంచి నీళ్ల పోరాటం: 
ఈ పోరాటం గురించి మనకు చాలా Literature avaialable లో వుంది. ఈ ఉద్యమానికి దారి తీసిన పరిస్తితులు ఏమిటి ? దాన్ని ఎలా organise చేసారు, సవర్ణుల ప్రతిఘటనను ఎలా ఎదుర్కొన్నారు, వేలాది మంది ని ఎలా సమీకరించాగాలిగారు అన్న విషయాలు మనం ఏ పుస్తకం చదివినా మనకు చాలా వరకు తెలుస్తాయి. 

కాని బాబాసాహెబ్ యొక్క వ్యూహం “మహాద్ చెరువు పోరాటాన్ని అంతర్జాతీయ వార్తలుగా ప్రపంచానికి తెలియజేసి నిరాకరించబడిన కనీస మానవ హక్కుల పట్ల సాక్ష్యాలను, మద్దతును కూడగట్టడం”

కాలారాం,నాసిక్ దేవాలయ ప్రవేశాల ఉద్యమం: 

కాలారాం,నాసిక్ దేవాలయ ప్రవేశాల ఉద్యమం కూడా అంటరాని వారికి గల పరిస్తితుల్ని అంతర్జాతీయ ప్రపంచానికి చాటి బ్రిటిష్ వారిచే హక్కులు పొందే అవకాశాన్ని ఎలా సద్వినియోగ పరుచుకున్నాడో మనం రౌండ్ టేబుల్ సమావేశాల్లో చూడవచ్చు.  
సైమన్ కమిషన్ కి పీడిత భారతాన్ని, విముక్తి ప్రణాళికను అర్థం చేయించి,రౌండ్ టేబుల్ సమావేశాలలో పీడిత వర్గాల తరపున గట్టి వాదన వినిపించి అనేక హక్కులను చట్టాలుగా తెచ్చాడు.

పత్రికా సంపాదకత్వం : 

ఒక వైపు ఉద్యమాలు చేస్తూనే పలు పత్రికలు నడిపారు. సామాజిక ఉద్యమాన్ని ముందుకు నడిపించేందుకు మీడియానే మాధ్యమంగా ఎంచుకున్నారు. దీని కోసం ప్రాంతీయతకు పెద్దపీట వేస్తూ ఆయన మరాఠీలో తొలి జర్నల్ ''మూక్ నాయక్''ను ప్రారంభించారు. తొలి నాళ్లలో రాజశ్రీ షాహు మహరాజ్ ఈ మ్యాగజైన్‌కు సాయం అందించారు.

బాబాసాహెబ్ గారు 31 జనవరి 1920నాడు ''మూక్‌నాయక్'' జర్నల్ తొలి సంచిక కోసం అంబేడ్కర్ రాసిన తొలి కథనం ప్రారంభ వ్యాఖ్యలు ఇవి. ''ఇక్కడి సామాజిక వ్యవస్థను ఓ సినిమాలా ప్రేక్షకుడి కోణంలో చూస్తే ఈ దేశం అన్యాయాలకు పెట్టనికోటలా కనిపిస్తుంది. కచ్చితంగా అలానే అనిపిస్తుంది…''
(నేటికి జాతీయ స్థాయిలో బహుజనులకు ఒక మీడియా లేకపోవడం ఆలోచించవలసిన అంశం)
కాంగ్రెస్ తరహాలో ఆయనకు ఆర్థిక, సామాజిక సాయం అందలేదు. అయితే, పేదల ఉద్యమంగా ఆయన దీన్ని నడిపించారు. భూమికి లేదా యజమానులకు బానిసలైన వెనుకబడిన బలహీన వర్గాలే ఆయన అనుచరులు.
దీంతో ఆయనకు ఆర్థికంగా ఎలాంటి సాయమూ అందేది కాదు. బయట నుంచి ఎలాంటి మద్దతూ లేకుండానే తన భుజాలపై అంబేడ్కర్ ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించాల్సి వచ్చేది.

సాంస్కృతిక సామాజిక విప్లవకారుడు: 
బ్రహ్మణ-బౌద్ధ సంఘర్షణే భారత చరిత్ర అని చాటి,హిందూమతానికి వ్యతిరేకంగా ఆరు లక్షలమందిని బౌద్ధ ధర్మంలోకి  నడిపించాడు. (మరింత లోతైన అద్యయనం అవసరం…)  

త్యాగం: 
సమాజం కోసం భార్యను,నలుగురు పిల్లల్ని కోల్పోయి,అనారోగ్యంతో మహా పరినిర్యాణం చెందారు.

D. ఛత్రపతి సాహు మహారాజ్


ఛత్రపతి సాహు మహారాజ్:

1874 జూన్ 26న రాధాబాయి, జయసింగ్ ఆబాసాహేబ్ ఘాట్గేలకు జన్మించిన యశ్వంతరావు ఘాట్గేనే ఆ తర్వాత కాలంలో "సాహుమహారాజ్" గా  ప్రసిద్ది చెందుతాడు . ఘాట్గేలు మహారాష్ట్ర లో వెనుకబడిన తరగతులకి ( ఓబీసీ ) చెందిన   వ్యవసాయం చేసుకుని జీవించే కున్భీ కాపు కులం. ఛత్రపతి శివాజీ స్థాపించిన మరాఠ సామ్రాజ్యంలోని కొల్హాపూర్ రాజ్యంలో వారసులు లేకుంటే నాల్గవ శివాజీ భార్య రాణీ ఆనందబాయి 1884 మార్చి , 17 న  తన బంధువుల అబ్బాయిని దత్తపుత్రుడిగా స్వీకరించి  యశ్వంత్ రావు ఘాట్గే కి ముద్దుగా  ' సాహు ' అని  పేరు పెట్టుకుంటది. మూడేళ్ళకే తల్లిని కోల్పోయిన సాహు , 1886 మార్చి 20 న తండ్రి మరణంతో 11 ఏళ్ళకే తల్లిదండ్రులిద్దరులేని వాడైనాడు .సాహు చిన్నతనమంతా ఆంగ్లేయ అధ్యాపకుల పర్యవేక్షణ లో జరిగినందున ఆధునిక భావాలు పుణికి పుచ్చుకున్నాడు . యుక్తవయసు రాగానే 1894 ఎప్రిల్ 2 న సింహాసనం అధిష్టిస్తాడు సాహు .
 
1630 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని కున్భీ కాపు వ్యవసాయ శూద్ర కులం (బీసీ )  లో  పుట్టిన శివాజీ ఏ సింహాసన వారసత్వం లేకుండా స్వశక్తితో ఒక రాజ్యాన్ని స్థాపించిన శివాజీ జీవితం ప్రజాస్వామ్య దేశంలో బానిస బ్రతుకు బ్రతుకుతున్న శూద్రులకు వీపు మీద ఒక  చరుపులాంటిది. రాజ్యం కాదు ప్రజలు తమదిగా భావించే స్వరాజ్యంలో  రైతులు ,  స్త్రీలు , అస్పృశ్యులు , ఆదివాసూలు ,  సామాన్యులను ఎలా భాగస్వామ్యం చేయాలో రాజ్య నిర్మాణం ఎలా ఉండాలో అనే ప్రణాళిక కి ఆయన పాలన విధానం మాతృక లాంటిది......
      జాతీయ భావన లేని , దేశ ప్రేమ లేని ఆధిపత్య గుంపు తమ స్వార్థం కోసం శారీరక శ్రమ తెలియని గుంపు ఎవరు కొత్త రాజుగా వచ్చినా పరుగెత్తి వెళ్ళి పాదాల చెంత  మోకరిల్లి విధేయతను ప్రకటించుకుంటూ కులకర్ణిలుగా ( పట్వారీ )  పటేoడ్లుగా , దేశముఖ్ లు దేశపాండేలు జాగీర్‌దారులుగా తమ పీఠాలకు డోకా లేదనే హామి తీసుకొని అడుగులకు మడుగులొత్తుతూ పాదాలను తమ చేతుల్లోకి తీసుకొని తమకు నచ్చిన రీతిలో పాలన సాగిస్తూ ప్రజలను రైతులను వేధిoచుక చంపుతూ ఖజానా నింపుతుంటే రాజ్యమంటే దోపిడి అని రాజు అంటే క్రూరుడని ప్రజలు భావిస్తున్న కాలంలో.., రైతులకు భూములని కొలిపించి న్యాయమైన పన్ను నిర్ణయం చేసి కరువు సమయంలో పన్ను మినహాయింపునివ్వడమే గాకుండా అదనపు సాయాన్ని అందించి దేశముఖ్ దేశపాండేలు తన రాజ్యంలో గతంలోలాగా అరాచకాలకు పాల్పడితే సహించేది లేదనీ వాళ్ళు కూడా ఏ హంగు, ఆర్భాటాలు లేకుండా రైతుల వలే సాదారణ ఇండ్లల్లో నివాసం ఉండాలనీ హుకుం ఈ దేశ సామాన్య ప్రజలకు ఈ దేశం మీద ప్రేమ కల్పించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ . 
         శివాజీ దళితులని దుర్గాధిపతులని చేసిండు. శివాజీ గూఢాచారి విభాగం (ఇంటెలిజెన్స్ ) అధిపతి బాహిర్జీ నాయక్ ఆదివాసీ  రామోషి తెగ వ్యక్తి.  నౌకాదళంలో సముద్రంలో  చేపలు పట్టే కోలీ , సొంకాలీ , భండారీ లాంటి మట్టి మనుషులని సైన్యంగా మార్చిండు. ఆయన రాజ్యంలోని కొంతమంది మంత్రుల గురించి,

1)విదేశీ వ్యవహారాల మంత్రి ముల్లా హైదర్
2)ముఖ్యమైన ఆయుదగరా మంత్రి ఇబ్రహీం ఖాన్
3)నౌకదాలపతే దౌలత్ ఖాన్
4)శివాజీ అంగరక్షకుడు మదాని మెహతర్ శివాజిని హౌరంగజేబు ఆగ్రాలో భందించినప్పుడు తన ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఈ బ్రాహ్మణులు ఎవ్వరు రాజులు అయిన సహిస్తారు... సుల్తానులు ,మొగలులు లాంటి వారిని సమర్దిస్తారు.కానీ,శూద్రులు రాజులు అయితే తట్టుకోలేరు.ఆయన మీద ఎన్నో కుట్రలు చేశారు.ఆయన నిజంగా హిందువు అయితే ఆయన రాజ్యంలోని మంత్రులు అందరూ ముస్లింలు ఎందుకు ఉన్నారు.ఆయన భవనం ముందు దర్గా ఎందుకుకట్టించాడు?ఉర్దూ నిఘంటువుని ఎందుకు అభివృద్ధి చేసిండు?ఒకసారి ఆలోచించండి.కొంతమంది స్వార్థం కోసం ఏమైనా చెప్తారూ కానీ మనం నిజం తెలుసుకొవాలి. శివాజీకి దుర్గ మాత కత్తిని బహుకరించింది అంటారు ఆ కత్తి ఇప్పటికి మ్యూజియం లో ఉంది దాని మీద పోర్చుగిసు భాషలో ఏవేవో అక్షరాలు ఉన్నాయి. బహుజనులు ఇప్పటికైనా మేలుకొని నిజం తెలుసుకోండి.
అది జాతీయ సైన్యం . అది దేశమంటే తమ రాజ్యమంటే ప్రేమ గల నిజమైన సైన్యం. అందుకే అపుడు ప్రజలు ఈ దేశం మాది రాజు మా నాయకుడు అని భావించారు. 

     అలా విదేశీ ముస్లీంల దండయాత్రతో భారత దేశం విదేశీయుల పాలైన సంధర్భంలో ఈ దేశంలో తిరిగి స్వరాజ్యాన్ని స్థాపించింది ఇక్కడి మూలనివాసులే..... 
      ఆ మూలనివాసీల శూద్రుల నాయకుడు శివాజీ మహారాజ్ ....
     
బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి. 
క్షత్రియులు మాత్రమే యుద్దాలు చేయాలి , రాజ్యమేలాలి , 
వైశ్యులు మాత్రమే వ్యాపారం చేయాలి. 
     
శూద్రులు పై మూడు వర్గాలకి సేవ చేయాలన్న సంధర్భంలో ..., 
నాలుగు శాతం ఉన్న క్షత్రియులు మాత్రమే యుద్ధం చేస్తే ఈ దేశాన్ని కాపాడుకోలేమని గ్రహించిన వ్యవసాయ కులానికి చెందిన మరో కున్భీకాపు సంత్ తుకారాం ( భక్త తుకారాం )  గురువుగా  ఛత్రపతి శివాజీకి హితబోధ చేస్తాడు. 
ఆ మేరకు శివాజీ రాజ్యంలో జూన్ నుండి అక్టోబర్ నాటికి పంట చేతికి వచ్చినంక  రైతులందరు దసరాకి (బలి చక్రవర్తి గుర్తుగా )  సైనిక శిక్షణ తీసుకోని సంక్రాంతి నుండి ( పంట ఇంటికి చేరినంక )  యుద్ధాలలో పాల్గొని శివాజి సామ్రాజ్యాన్ని విస్తరింపచేస్తరు . 

ఈ దేశంలో తిరిగి రైతులచే ,సామాన్యులు , మహిళలచే స్వరాజ్యం స్థాపించబడిoది. శివాజీ సైన్యంలో పెద్ద ఎత్తున రైతులతో పాటు మిగతా శూద్రులు , అతిశూద్రులు ( దళితులు ) , ఆదివాసీ రామోషి లాంటి తెగలు , ముస్లీంలు (మతం మారిన ఈ దేశ మూలనివాసీలు) పనిచేసిండ్రు.

ఆంగ్లేయులు మన దేశాన్ని వదిలి పోయి డెబ్బై సంవత్సరాలు అవుతున్నా పరిపాలనా / అధికార భాషగా ఆంగ్లమును కొనసాగిస్తూ సాదారణ గ్రామీణ ప్రజలనుండి గ్రాడ్యేట్ వరకు బ్యాoక్ లో ఖాతా ఎలా ఓపెన్ చేయాలో తెలియని ప్రస్తుత పరిస్ధితిని పోల్చుకుంటే ఛత్రపతి శివాజీ తన కాలంలో పరిపాలన భాష అయినా పర్షియన్ ని తొలగించి ప్రజల భాష మరాఠీ నే పరిపాలన భాషగా చేసిండు.....

స్వదేశీ వాణిజ్యం , పరిశ్రమలు కాపాడేందుకు విదేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువుల మీద ఆ రోజుల్లోనే భారీ సుoకాలు విధించిండు. భారతదేశంలో స్త్రీ పురుషులని సంతలల్లో అమ్మడం కొనడం చేసే రోజుల్లో బానిస వ్యాపారాన్ని నిషేధించిండు. 

స్త్రీల విషయంలో శివాజీ చాలా ఉన్నతమైన వైఖరి కలిగి ఉన్న వ్యక్తి. 1678 లో సైన్యాధిపతి శకూజీ గైక్వాడ్ చేలాది దుర్గం ముట్టడి0చి సావిత్రిబాయి దేశాయ్ అనే ఆ దుర్గాధిపతిని మానభంగం చేస్తే శివాజీ కళ్ళు పీకించి యావజ్జీవ కారాగారవాసం విధించిండు. 

కళ్యాణ్ సుబేదార్ ని ఓడించాక ఆమె కోడలిని ఒక యోధుడు శివాజీకి కానుకగా సమర్పిస్తే  ఆమెని చూసి శివాజీ 'మా అమ్మ ఇంత అందంగా ఉంటే నేనెంత అందంగా ఉండేవాడినేమో ! ' అని ఆమెని  తిరిగి సగౌరవంగా వెనక్కి పంపిస్తాడు. 

రాంజ గ్రామ అధికారి పాటిల్‌ ఓ పేద రైతు కూతురిని మానభంగం చేస్తే ఆత్మహత్య చేసుకుంటది. అది తెలిసిన శివాజీ పాటిల్‌ కాళ్ళు చేతులు ఖండించే తీవ్రమైన శిక్ష ని విధించి వెంటనే అమలు చేస్తాడు. శివాజీ తీర్పు విన్నoక రంగే పాటిల్ అక్కడ ఉన్న దాదాజి కొండదేవ్ తో ' అర్హత ఉన్న వాళ్ళే తీర్పు చెప్పాలీ ' ఆ అధికారం బ్రాహ్మణుడికి ఉంటుంది లేదా రాజుకి ఉంటుoది అని శివాజీ యొక్క కులాన్ని ప్రశ్నిస్తాడు.....
            అలాంటి ఒక సువిశాల మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన శివాజీకి పట్టాభిషేకం చెయ్యడానికి
ఏ బ్రాహ్మణుడు ముందర రాలేదు 
కారణం శివాజీ శుద్రుడు కాబట్టి.....

      హిందు ధర్మశాస్త్రాల ప్రకారం బ్రాహ్మణులకి క్షత్రియులకి మాత్రమే  రాజయ్యే హక్కు ఉంది. దాంతో శివాజీ పట్టాభిషేక కార్యక్రమానికి కాశీ నుండి అప్పుడు గంగాభట్ అనే బ్రహ్మాణున్ని అతని బరువుకు సరితూగే బంగారం ఇస్తానని ఒప్పించి రాజ్యాభిషెకం చెయ్యడానికి పిలిపిస్తే కాలిబ్రొటన వేలు తో గగాభటుడు శివాజీ నుదిటకి తిలకం దిద్ది  రాజ్యాభిషేకం చేస్తాడు .వ్యక్తిగతంగా శివాజీకి బ్రాహ్మణులు అందరు వ్యతిరేకం కాకపోవచ్చు. కానీ బ్రాహ్మణ ధర్మం కులం పేరిట ఒక మహా చక్రవర్తిని అవమానించింది. శూద్రులు రాజులు కాకూడదని ధర్మం విధించింది. ముసల్మాన్ రాజు కావచ్చు కానీ సూద్రుడు కాలేడు. 

మహా చక్రవర్తి ఐన శివాజీని జీవితాంతం వెంటాడిన బ్రాహ్మణవాదం ఆ తర్వాత తన పబ్బం గడుపుకొనుటకు శివాజీని ముస్లిం వ్యతిరేకిగా కరుడుగట్టిన హిందూ మతాభిమానిగా చిత్రించి చరిత్రని వక్రీకరించింది. భవానీ మాత ఖడ్గం ప్రసాదించినట్లు మూఢవిశ్వాసాన్ని  ప్రచారం చేసారు.నిజానికి అది అపుడు పోర్చుగల్ లో తయారు  చేయించిన కత్తి. శివాజీ వాడిన ఆ ఖడ్గం ప్రస్తుతం సతారా మ్యూజియం లో ఉంది. దానిపై పోర్చుగీస్ లిపి ఉంది. ఛత్రపతి  బ్రాహ్మణమతానికి లోబడి పని చేసిండు. అవలంభిoచిండు. కానీ మత దురాభిమాని కాదు. అప్పటి మొఘల్ చక్రవర్తికి వ్యతిరేకంగా స్వరాజ్య స్థాపన కోసం పని చేసిండే తప్ప ముస్లిములకు వ్యతిరేకంగా కాదు. శివాజీని ముస్లిం మత వ్యతిరేకిగా ప్రచారం చేసి తప్పుడు జాతీయ వాదానికి ప్రతీకగా నిలబెట్టారు. . .


చక్రవర్తి శివాజీ ని ఈ రోజు బ్రహ్మానీకరణం చేసీ మనల్ని మోసం చేస్తుంటే దాన్ని తెల్సుకోకుండా మతం మత్తులో అగ్రవర్ణ ఆధిపత్య బ్రాహ్మణీయ  మాయాజాలంలో నిండా మునిగి తెలవిలేక పావులా బీసీలు  మారడం విచారకరం.

1874 ఫిబ్రవరి 12 న మహాత్మ జ్యోతి బాపూలే రాయగడ్ లోని శివాజీ సమాధిని వెలికితీసి శివాజీ చరిత్రని గేయ రూపంలో రాసి 1885 నుండి శివాజీ జయంతి ఉత్సవాలను ప్రారంభించిండు.

సాహూ మహారాజ్ గురించి కొంత సమాచారం:
సాహూ మహారాజ్ దృక్పదాన్ని మార్చిన సంఘటనలు:

i) 1900 వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఒక రోజు సాహు మహారాజ్ పంచగంగా నదిలో స్నానం చేస్తున్న సమయంలో బ్రాహ్మణ పురోహితుడు స్నానం  చేయకుండానే వచ్చి సాహు మహారాజ్ క్షత్రియ వంశస్తుడు కానందున ఒక వ్యవసాయం  చేసుకునే కులానికి చెందిన శూద్రుడైనందున ఈశడిoపుతో వేదోక్త మంత్రాల బదులు పౌరాణిక  మంత్రాలు చదివి అవమానిస్తాడు . పుట్టుకతోనే మనిషి కులం నిర్ణయించబడుతుందనీ రాజైనంత మాత్రాన , దత్తత వచ్చినంత మాత్రాన క్షత్రియుడిగా మారిపోడని వాదనకు దిగుతాడు.

          ఈ సంఘటన సాహు మహారాజ్ ని మహాత్మ జ్యోతిబాపూలే సత్యశోధక సమాజ్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే వారసత్వాన్ని ఎన్నుకోవడానికి కారణమైతది.బాస్కరరావు జాదవ్ అనే ఉద్యోగిని ' సత్యశోధక్ సమాజ్ ' నడిపే బాధ్యతలు అప్పచెప్పి ' మరాఠ దీనబందు ' పేరుతో పత్రికని నడిపించి సత్యశోధక సమాజ తాత్విక దృక్పథాన్ని ప్రచారం చేయించిండు . బ్రాహ్మణేతరులకి పురోహిత శిక్షణనిచ్చేందుకు సత్యశోధక్ సమాజ్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రారంభమైంది. కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వందలాది వివాహాలు , వేడుకలు సత్యశోధక్ సమాజ్ పద్దతిలో జరిగాయి.

ii) తను సింహాసనం అధిష్టించే నాటికి తన రాజ్యంలో మత కర్మలలో మొదలు పరిపాలనలోని అన్ని ఉద్యోగ  రంగాలతో పాటు వ్యాపారం , వడ్డీ వ్యాపారం లో కూడా బ్రాహ్మణులే నిండిపోవడం సాహు గమనించిండు . బ్రాహ్మణేతరులని ఉన్నతోద్యాగాల్లోకి తెస్తే తప్ప వారి సామాజిక హోదాలో , జీవితాల్లో మార్పు రాదని , బ్రాహ్మణ ఆధిపత్యానికి అడ్డుకట్టపడదని  సాహు భావించిండు . తన ప్రైవేట్ సెక్రెటరీ ఉద్యోగానికి అండర్ గ్రాడ్యేట్  ( డిగ్రీ స్థాయి లేని ) అయిన ఒక జైనుడిని ఎన్నిక చేసుకుంటే బ్రాహ్మణ సమాజం ఏకమై పెద్ద ఎత్తున నిరసన తెలియచేసింది. ఐతే ఆ రాజ్యంలో అప్పటికి గ్రాడ్యేషన్ పూర్తి చేసిన బ్రాహ్మణేతరుడు ఒక్కరు లేరు.

          సమస్యను గుర్తించిన సాహు వెనుకబడిన కులాల వారందరికి స్కూల్స్ , హాస్టల్స్  ప్రారంభించి విద్యని ఒక ఉద్యమంగా నడిపిండు . కొల్హాపూర్ పట్టణంలో హాస్టల్స్ కాలనీనే నిర్మించిండు . ప్రపంచ చరిత్రలో ఇదొక అరుదైన విషయం. 1901 లో జైన హాస్టల్ , విక్టోరియ మరాఠ హాస్టల్ , 1906 లో ముస్లీంలకు , 1907 లో వీరశైవ లింగాయత్ లకు , 1908 లో అంటరానివారికి , మరాఠాలకీ 1921లో దర్జీ మరియు నేత కులస్తులకి  నామ్ దేవ్ హాస్టల్‌ , విశ్వకర్మలకి సోనార్ హాస్టల్స్ నిర్మించిండు .ప్రతి గ్రామంలో కనీసం ఒక ప్రాథమిక పాఠశాలనేర్పరచి  అందరికి , అన్ని కులాల వారికి ఉచిత నిర్భంధ ప్రాథమిక విద్యనందించిండు . పాఠశాలలకు స్వంత భవనాలు ఏర్పడే వరకు  గ్రామాల్లోని అన్ని ఆలయాలను , చావడీలను పాఠశాలలుగా వాడాలనీ , ఏ గ్రామంలో ఏ కులస్తులు మెజారిటీ గా ఉన్నారో చూసి ఆ కులపు వ్యక్తినే ఉపాధ్యాయుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులనిచ్చింది. ముస్లీంలకు వాళ్ళ మాతృ భాషలోనే పాఠశాలలు ప్రారంభమైనాయి . ఆ తర్వాత కాలంలో కొంత మార్పు రాగానే  కులపరమైన విద్యాసంస్థలని రద్దు చేస్తూ  అన్ని కులాల  , మతాల వారు కలిసిమెలిసి ఏ పాఠశాలలోనెైన , విద్యా సంస్థలో నైనా చదువొచ్చని ప్రకటన ఇచ్చింది సాహు ప్రభుత్వం .వ్యవసాయం ఇతర వృత్తులు చేసే వయోజనుల కోసం రాత్రి పాఠశాలలు ఏర్పడ్డాయి.
iii) ఒక ఉద్యమాన్ని నడిపించే నాయకుడు కేవలం ఉపన్యాసాలిస్తే సరిపోదని తను చెప్పిన  ఆచరించి చూపిండు సాహు మహారాజ్ . నిరక్షరాస్యుడైన గంగారామ్ కాంబ్లే అనే అంటరాని వక్తి ఆధారం చూపించమంటే సాహు డబ్బిచ్చి హోటల్ పెట్టిస్తే ఎవరు ఆ హోటల్ కి రాకుంటే సాహు స్వయంగా తన పరివారంతో వెళ్ళి ముందు తను  టీ తాగి తన వాళ్ళందరికి తాగిస్తాడు . పాలన నిర్వహణకి అవసరమైన విద్యార్హతలు లేని అంటరాని వారిని తన కుటుంబంలో వివిధ రకాల పనులకి తీసుకున్నాడు . రథచోదకులుగా , మావటీలుగా , రక్షకభటులుగా నియమించిండు . 1919 , సెప్టెంబర్ 6న అంటరానితనాన్ని పాటించడం నేరమని ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. అంటరాని ఉద్యోగులతో ప్రజలు గానీ ,  ప్రభుత్వ కార్యాలయాల్లో ఇతర ఉద్యోగులు అగౌరవంగా ప్రవర్తిస్తే పిర్యాదు అందితే నేరస్తుల మీద చర్యలు తీసుకుంటారు. నేరస్తులు ఉద్యోగులైతే ఆరు వారాల్లోగా విచారణ జరిపి నేరస్తులని తేలితే ఉద్యోగం నుండి తొలగింపుతో పాటు పెన్షన్ కూడా రద్దైపోతుంది . 60 సంవత్సరాల భారత ప్రభుత్వం తెచ్చిన ఎస్.సి. / ఎస్.టీ. అట్రాసిటీ చట్టం కూడా ఇంత బలమైనది కాదు.

జులై 26 , 1902 భారత దేశ చరిత్రలో ఒక చరిత్రాత్మక దినం. ఆ రోజు ఛత్రపతి సాహు మహారాజ్ ప్రభుత్వం , ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో '  ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత '  ఉండాలనే ఆలోచనతో  ప్రభుత్వోద్యోగాలన్నింటిలో వెనుకబడినవర్గాల వారికి  50% రిజర్వేషన్ లు కల్పిస్తూ సంచలనాత్మక ఉత్తర్వులని జారీ చేసింది . వెనుకబడిన వర్గాలు అనగా బ్రాహ్మణ , ప్రభు , షెన్వీ , పార్శీ మరియు ఇతర అభివృద్ది చెందిన కులాలు మినహా మిగిలిన అన్ని కులాల వారు . ( Backward classes shall be understood to mean all castes other than brahmin , Prabhus, Shenvis , Parsees and other advanced classes .) అంటరానివారి నుండి అన్ని మతాలలో వెనుకబడినవారు కూడా రిజర్వేషన్ కిందికే వస్తారు.

బాలగంగాధర తిలక్  లాంటి బ్రాహ్మణ జాతీయోద్యమ నాయకులు సాహు మహారాజ్ నడిపిస్తున్న పూలే వారసత్వ ఉద్యమాన్ని , పరిపాలన లో చేస్తున్న మార్పులని చూసి ఓర్వలేక అనేక కుట్రలు చేస్తారు. దాడికి దిగుతారు.
సాహు చేపట్టిన చర్యలు:
1) గ్రామ పరిపాలన రంగంలో వంశపారంపర్యంగా వచ్చే  ముఖ్యులైన పటేల్ ( పాటిల్ ) , పట్వారీ ( కులకర్ణి ) వ్యవస్థని 1918 లో రద్దు చేసిండు .

2) 1920 మే , 3వ తేదిన వెట్టిచాకిరి వ్యవస్థ ని రద్దు చేస్తూ చట్టం చేసింది ప్రభుత్వం . ఆ తర్వాత 55 ఏండ్లకు స్వాతంత్రం వచ్చినంకా 1975 లో మాత్రమే భారత ప్రభుత్వం వెట్టిచాకిరి నిర్మూలన చట్టం చేసింది .

3) గ్రామీణ పరిపాలనలో కింది స్థాయి ముఖ్య ఉద్యోగాలైన ' తలాతీ ' ( సుంకరి,గ్రామ రెవెన్యూ సహాయకులు) లుగా అస్పృశ్యులే ఉంటారు కాబట్టి వాళ్ళందరికి ఉద్యోగ నిర్వహణకు అవసరమైన శిక్షణనిచ్చేందుకు ట్రేనింగ్ స్కూల్స్ ప్రారంభించిండు. 2010 వరకు ఆంధ్రప్రదేశ్ లో వీరికి శిక్షణ లేదు.

4) ఆదివాసీ తెగలకు , అంటరాని వారికి సంబంధించి బ్రిటీష్ ప్రభుత్వం పెట్టిన ' నేరస్థ కులాల చట్టాన్ని ' 1918 లో రద్దు చేసిoడ్రు. మహర్ , మాoగ్ , రామోషీ , బెరాద్ లాంటి నేరస్థ కులాలుగా పరిగణింపబడే కులాల ప్రజలు ప్రతి రోజు పోలీస్ స్టేషన్ లో హాజరై సంతకం చేసే అమానుషం ఈ చర్యతో రద్దైoది .
Babasaheb – Sahu Maharaj

 సాహు మహారాజ్ అంటరానివారికి ఆపద్భాంధవుడిగా మారిన విషయం తెలుసుకున్న బాబా సాహేబ్ అంబేడ్కర్ సాహు మహారాజ్ ల మద్య పరిచయం పెరిగి రాబోయే బ్రిటీష్ చట్టాలు మంచిచెడుల గురించి మాట్లాడుకునేవారు. అంబేడ్కర్ ఆస్పృశ్యుల హక్కుల సాధన కోసం ఒక పత్రిక పెట్టాలనుకుంటున్నాననీ , ఐతే ఆర్థిక ఇబ్బందులతో చేయలేకపోతున్నానడంతో ఆ పత్రిక కి ఆర్థిక వనరులు సమకూర్చే బాధ్యతను తీసుకొని మొదట 2500 రూపాయలు ఇవ్వడంతో ' మూక్ నాయక్ ' పత్రిక ప్రారంభమౌతది.1920 , ఎప్రిల్ 15 న నాసిక్ లో అంబేడ్కర్ మరియు మిత్రులు  అంటరానివారికోసం ఒక హాస్టల్ కట్టాలనుకుంటే ఆ కార్యక్రమ ప్రారంభోత్సవానికి హాజరై ఐదు వేల రూపాయలు ఇస్తాడు సాహు .  1920 లో అంబేడ్కర్ ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకొనుటకై ఆర్థిక సహాయం చేస్తాడు సాహు మహారాజ్ . అంబేడ్కర్ విదేశాల్లో ఉన్నంత కాలం ' మూక్ నాయక్ ' పత్రిక నిర్వహణ కి ఆర్థిక సహాయం చేసిండు .రమాబాయి యోగక్షేమాలను విచారిస్తూ , ఆమెకు అవసరమైన ఆర్థిక సహాయం చేస్తూ బాధ్యత గల స్నేహితుడిగా వ్యవహరించిండు సాహు . 1922 ఫిబ్రవరి 16న డిల్లీలో జరిగిన అంటరాని కులాల జాతీయ మహాసభలో పాల్గొన్న సాహు ' ఈ సభలో ప్రసంగించే అర్హత నాకన్న మించి ఉన్న అంబేడ్కర్‌  ఇంగ్లాండ్ లో ఉన్నందున పాల్గొనలేకపోవడం మన దురదృష్టం. మీ జాతి గర్వించదగిన మహోన్నత నాయకుడు అంబేడ్కర్ ను మీరందరు ఆదర్శంగా స్వీకరించాలని , ఆయన స్థాయికి అందుకోవడానికి మీ అభివృద్ధికి కావలిసిన సేవలను అందించడానికి నన్ను అనుమతించమని ప్రార్థన ' అంటూ మాట్లాడిండు .


 Women empowerment – Sahu Maharaj:
 
పితృస్వామ్య , కుల , మత వ్యవస్థల వల్ల స్త్రీల మీద జరుగుతున్న అమానుషాలని గ్రహించిన సాహు మొదట తన భార్య లక్ష్మీబాయి కి యూరోపియన్ టీచర్ ల ద్వారా ఆధునిక విద్యను చెప్పించిండు . సంగీతంలో , చిత్రలేఖనంలో , ఎంబ్రాయిడరీ లో శిక్షణ ఇప్పించిండు .కొల్హాపూర్ సంస్థానంలో బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభం చేసిండు .ఉన్నత విద్యలోకి బాలికలను ప్రోత్సహించేందుకు ఉపకారవేతనాలు , ప్రోత్సాహక బహుమతులు ఏర్పాటు చేసిండ్రు. కొల్హాపూర్ రాజారాం కాలేజీ లో బాలికలకు ప్రత్యేక విభాగం ఏర్పరిచిండ్రు. వెనుకబడిన ఆడపిల్లలకు ఉచిత భోజన , వసతి సదుపాయాలు కల్పించిండ్రు. 1919 జూన్ లో బాల్య వివాహాల రద్దు చట్టం  వచ్చింది. 1919 జులై 12న కులాంతర , వర్ణాంతర వివాహాలను  చట్టబద్దం చేస్తూ చట్టం తెచ్చిన ' కొల్హాపూర్ స్పెషల్ మ్యారేజీ ఆక్ట్ - 1918 '  ప్రకారం  ఎందరో యువతీ యువకులు తమకు నచ్చిన భాగస్వామ్యులని ఎన్నుకున్నారు. విడాకులు మంజూరు చేయడం లో స్త్రీల నిర్ణయానికే ప్రాధాన్యతనిస్తూ 1919 ఆగష్ట్ 2 న విడాకుల చట్టం మరియు స్పెషల్ మ్యారేజీ ఆక్ట్ అప్పుడు దేశంలో సంచలనాలను సృష్టించాయి. 1920 జనవరి 17న జోగిని , దేవదాసీ వ్యస్థను రద్దు చేసిండు . ప్రభుత్వం దేవదాసీ ల పునరావాసానికి చర్యలు తీసుకుంది. 1919 జులైలో వ్యభిచార వృత్తిలో ఉన్న స్త్రీలకు పునరావాసాన్ని కల్పించాల్సిందిగా అధికారులను ఆదేశించిండు.కొల్హా పూర్  ప్రాంతంలోని కోర్టులన్నిoటిలో  సివిల్ , క్రిమినల్ కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతుండేది. రోజుకి ఎన్ని కేసులు విచారణ జరుపుతామనే అంచన లేక పెద్ద సంఖ్యలో పిలవడము చాలా మంది కేసు బెంచ్ మీదికి రాకనే తిరిగి పోవడం పదే పదే జరుగడంతో చాలా మంది పేదలు ఇబ్బంది పడేవారు. ఈ సమస్యకి పరిష్కారంగాను 1919 అక్టోబర్ 17న చట్టం చేస్తూ రోజు కు కేవలం మూడు కేసులకి మించి విచారణకు స్వీకరించకూడదు.అక్కడ సరైన న్యాయం జరగలేదని ఏ పౌరుడైనా భావిస్తే నేరుగా మహారాజ్ ని కలవచ్చు.  సాహు 1920 లో రూపొందించిన హిందూ న్యాయశాస్త్రం లోని అనేక అంశాలను స్వాతంత్రానంతరం రూపొందిన ' హిందూ పర్సనల్ లా ' లో భాగంగా భారత పార్లమెంట్ ఆమోదించింది.

ఉన్నత విద్యావంతుడైన సాహు మహారాజ్ నిరంతరం ప్రజల మద్యే ఉంటూ సమస్యలు తెలుసుకుంటా  ప్రజల భాషలో మాట్లాడేవాడు . పరిపాలనలో ప్రజలకు అర్ధం కాని , ప్రజలకు ఇబ్బంది కల్గించే బ్రాహ్మణ గుమాస్తాల , పట్వారీలు వాడే మోడీ లిపిని పరిపాలన వ్యవహారాల్లో రద్దు చేస్తూ 1917 మార్చి లో నిర్ణయం తీసుకున్నాడు . తెలంగాణాలో నైజాం పాలన తర్వాత కూడా కొన్నాళ్ళు మోడి లిపి రెవెన్యూ రికార్డుల్లో వాడబడింది. కరువు వచ్చినపుడు రైతులకు అన్ని రకాల పన్నులను , రుణాలని మాఫీ చేసిండు . అప్పుల కింద రైతుల ఆస్తులని , పనిముట్లనీ , పశువులని బలవంతంగా జప్తు చేసే చర్యలను నిషేధిస్తూ 1894 లోనే చట్టం చేసిండు. 1918 లో తన రాజ్యంలో వడ్డీ వ్యాపారాన్ని పూర్తిగా నిషేధిస్తూ సహకార సంఘాలని ఏర్పాటు  చేసిండు . రాజ్యంలో ప్లేగు వ్యాధి వచ్చినపుడు టెలిఫోన్ వ్యవస్థను ఏర్పాటు చేసి యంత్రాంగాన్ని సమర్థవంతంగా పని చేయించిండు. రాధానగరి , పనాలా , కరవీర్ , శిరోల్ వంటి ప్రాజెక్ట్ లని నిర్మించిండు . ' కింగ్ ఎడ్వర్ట్ అగ్రికల్చరల్ ఇన్సిట్యూట్ ' ద్వారా రైతులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసిండు. తన తండ్రి పేరుతో ఏర్పరచిన ' జైసింగ్ రావు ఘాట్గే టెక్నికల్ ఇన్సిట్యూట్ '  ద్వారా సాంకేతిక శిక్షణ లభించి పరిశ్రమలు ఏర్పడ్డాయి.  చక్కర కర్మాగారాలు , బట్టల మిల్లులు , గోనే సంచుల ఫ్యాక్టరీలు , చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఏర్పడ్డాయి.
Future view of Sahu Maharaj

 స్వాతంత్రo గురించి సాహు 1917 , డిసెంబర్ 27 నాసిక్ లో జరిగిన సభలో ' ఇపుడున్న కులవ్యవస్థ యధాతథంగా కొనసాగుతూ ఉండేట్లైతే ఒకవేళ మన చేతికి రాజకీయాధికారం వచ్చినప్పటికీ అదొక నియంతృత్వ రాజ్యం గానే తయారవుతుంది. స్వరాజ్యం పేరిట ఒక నియంతృత్వ రాజ్యం ఏర్పడటాన్ని నిరోధించాలంటే కనీసం పదేళ్ళ పాటు వెనుకబడిన కులాలకు విద్యా , ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం కల్పించే విధానం కొనసాగాలి. ' అని అన్నాడు. బొంబాయి ప్రెసిడెన్సి బ్రిటీష్ ప్రభుత్వ సెక్రటరీ లార్డ్ విల్లింగ్టన్ కు 1917 , డిసెంబర్ 29 న లేఖ రాస్తూ ' వెనుకబడిన కులాలను , ముఖ్యంగా అస్పృశ్యులను సామాజికంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను గురించి గతంలో నేను ప్రస్తావించి ఉన్నాను. కొత్తగా రూపొందుతున్న భారత రాజ్యాoగం లో ఈ కులాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అస్పృశ్యులకు సంబంధించి మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని నా అభిప్రాయం . '  ప్రభుత్వం నియమించబోయే స్థానిక పాలక మండళ్ళలో వెనుకబడిన కులాలకు , అస్పృశ్యులకు తగిన ప్రాధాన్యత కల్పిoచాలని  కోరిండు . ముంబాయిలో కార్మికుల ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతూ ' రష్యా , జర్మనీ , ఇంగ్లాండ్ లలో వలే యుక్త వయసు వచ్చిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉండాలి ' అన్నడు. 

 

1917 లో మరాఠ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ' నేనిక్కడికి ఒక మహారాజ్ గా రాలేదు ఒక సామాన్యుడిగా వచ్చాను. మీరు నన్ను మీలోని ఒక శ్రామికుడిగా , రైతుగా భావించవచ్చు. నా పూర్వీకులు ఇదే పని చేశారు ' అనడం సాహు మహారాజ్ ఎంతటి నిగర్వి , సామాన్య ప్రజలకు ఎంత దగ్గరగా చేరువయ్యాడో అర్థం చేసుకోవచ్చు.  అందుకే ఒక అమెరికన్ చరిత్రకారుడు ఇలా అంటాడు  ' సాదారణ రైతు కుటుంబానికి , వెనుకబడిన కులానికి  చెందిన జ్యోతిబాపూలే సామాజిక ఉద్యమ కారుడు కావడంలో ఆశ్చర్యo లేదు. కానీ ఒక రాజు  అయిన సాహు మహారాజ్ ఇoత నిబద్దతతో సామాజిక ఉద్యమాలను నిర్వహించడం నిజంగా అరుదైన విషయం '. కేవలం మహారాష్ట్ర కే కాకుండా దక్షిణ భారతంలో జస్టీస్ పార్టీ ఉద్యమంతో పాటు  భారతదేశం మొత్తం మీద ప్రభావం చూపిన సాహు మహారాజ్ మే 6 , 1922 న మరణించిండు . అతని మరణాంతరం అంత్యక్రియలు సైతం బ్రాహ్మణేతర పురోహితుల చేత జరిగాయి.

భారతదేశ చరిత్రలో బహుజనులను బ్రాహ్మణుల పెత్తనం నుండి విముక్తి చేయటానికి సైద్ధాంతికంగా., పాలనపరంగా మహాత్మ జ్యోతిబా పూలే., ఛత్రపతి శివాజీల వారసుడిగా కృషి చేసి భవిష్యత్ భారతానికి సామాజిక న్యాయ-ప్రజాస్వామిక తాత్విక పునాదిని ఏర్పరచి ప్రజల రాజుగా మిగిలిపోయిన మహానీయుడు రాజర్షి "ఛత్రపతి సాహుమహారాజ్" గారు.


(ఛత్రపతి సాహుమహారాజ్ ఒక సంస్థానానికి రాజుగా వుండడం వాళ్ళ బహుజనుల బతుకులను మార్చే ప్రయత్నం చేసి మనకు మార్గ నిర్దేశం చేసారు.)

కాబట్టి బహుజనులు ఈ అగ్రవర్ణ కుట్రల్ని గ్రహించి తిప్పికొట్టి ఈ దేశంలో తొలిసారిగా 50%. రిజర్వేషన్స్ కల్పించిన  ఛత్రపతి సాహుమహరాజ్   ఇచ్చిన ' ఎవరి జనాభా ఎంతో..,. వారి వాటా అంత ' అనే నినాధం స్పూర్తిగా , బుద్ధుడు , మహాత్మా జ్యోతిరావు పూలే  , అంబేడ్కర్ , కాన్షీరాం ఆలోచన విధానం లో ముందుకు వెళుదాం...




 

B. మహాత్మ జ్యోతిరావు పూలే: సామాజిక ఉద్యమ పితమహులు

మహాత్మ జ్యోతిరావు పూలే,

ఈ నిచ్చెన మెట్ల సామాజిక వ్యవస్థ కు వ్యతిరేకంగా పోరాడిన మన బహుజన పితామహులు (ఫూలే,సాహు, నారాయణ గురు, పెరియార్) ల పోరాటాన్ని అర్థం చేసుకోవడంలో  మనం విఫలం కావడమే నేటి మన సామాజిక దుస్తితికి కారణం.
ఈ క్లాసు లో మహత్మా జ్యోతిరావు  ఫూలే, నారాయణ గురు గార్ల జీవితం వారి పోరాటం గురించి నేర్చుకున్నాం.
మన పితామహుల పోరాటాల గురించి మరికొంత సమాచారం …


మహత్మా జ్యోతిరావు  ఫూలే(1827-1890)  & సావిత్రి భాయి ఫులే (1831-1897) :

1. జోతిబా ఫులేకు 1 సంవత్సరం వయస్సులో ఉన్నప్పుడే తన తల్లి కన్ను మూశారు,ఆయన తండ్రి సంరక్షణలో పెరిగాడు.

 2.  "థామస్ పేన్" ఆలోచనలతో బాగా ప్రభావితమయ్యాడు మరియు పేన్ యొక్క ప్రసిద్ధ పుస్తకం ‘The Rights of Man’ ను చాలా ఆసక్తితో చదివాడు ఫూలే.

3. కేవలం 22 ఏండ్ల వయసులో జోతిబా ఫులే తన భార్యకు చదువు నేర్పించాడు మరియు అంటరానివారికి పాఠశాలలు ప్రారంభించాడు!  
1849లో, అతను 22 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, శూద్రులకు విద్యను అందించడానికి  భార్యతో ఇంటి నుండి వచ్చేసాడు. (మనం నేడు అమలు చేస్తున్న మధ్యాన భోజన పథకం ఫులే స్వాతంత్రానికి పూర్వమే అమలు చేసాడు)

4. 22 సంవత్సరాల వయస్సులో, అతను కేవలం పూణేలో మాత్రమే కాకుండా లండన్లో కూడా బాగా ప్రసిద్ది చెందాడు!  కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, లండన్ వారు అతని విద్య ఉద్యమాన్ని  కొనియాడారు.

 5. బ్రిటిష్ ప్రభుత్వం బ్రాహ్మణులకు దక్షణగా (డబ్బు/ వనరులు)ఇచ్చే పద్ధతిని జోతిబా ఫులే వ్యతిరేకించారు.  1848-49లో, దక్షణా మొత్తం సుమారు రూ. 4000/- ఉండేది.
22 సం౹౹రాల జోతిబా ఫులే ఈ పద్ధతికి వ్యతిరేకంగా నిలబడి అంటరానివారి విద్య కోసం ఆ డబ్బు కేటాయించాలని డిమాండ్ చేశారు.  అప్పటికే బ్రిటీష్ ప్రభుత్వం దక్షణ డబ్బులు తగ్గించిందని, ఇప్పుడు 22 సంవత్సరాల శూద్రుడు వారిని సవాలు చేయడం అప్పటి బ్రాహ్మణులకు మింగుడు పడలేదు.
 అప్పటివరకు ఎవరూ బ్రాహ్మణుల ఆధిపత్యన్నీ సవాలు చేయలేదు.
 
*చివరికి, బ్రిటిష్ ప్రభుత్వం ఆ దక్షిణలో కొంత భాగాన్ని విద్య కోసం కేటాయించింది!  ఇవి అంటరానివారి విద్యకు మొదటి నిధులు అని చెప్పవచ్చు!
{{ఈ నాటి ప్రిమెట్రిక్ స్కాలర్షిప్ ఆలోచన ఫూలే గారిదే}}

 6. 1854 లో, జోతిబా ఫులే ఒక స్కాటిష్ పాఠశాలలో పార్ట్‌టైమ్ టీచర్‌గా చేరాడు.

7. 1889లో, మహాత్మా జోతిబా ఫులేకు  పక్షవాతం వచ్చింది, దాంతో శరీరం కుడి వైపున పనిచేయకుండా ఆగిపోయింది.  కానీ బహుజనుల పట్ల ఆయనకు అంకితభావం చాలా బలంగా ఉంది, అతను సార్వజనిక సత్య ధర్మ పుస్థక (ది బుక్ ఆఫ్ ది ట్రూ ఫెయిత్) రచన ఎడమ చేతితో పూర్తి చేశారు.

8. బొంబాయిలో, 1885 లో, మహాత్మా జోతిబా ఫులే దిగువ కులాలు తమ కర్మకాండలు మరియు మతపరమైన ఇతరేతర కార్యకలాపాలను స్వయంగా నిర్వహించుకోవాలని నొక్కిచెప్పారు, తద్వారా బ్రాహ్మణ పూజారి పాత్రకు స్వస్తి చెప్పాలని.

 9. జోతిబా ఫులే బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా గొంతెత్తి వేదాలను "పనికిమాలిన కల్పితాలు" అని, "ఆస్పష్ట- అసంబద్ధమైన ఇతిహాసాల" ని మరియు "తప్పుడు స్పృహకు ప్రతిరూపం"అని చెప్పాడు.

10.  1856 లో బ్రాహ్మణులు మహాత్మా జ్యోతిరావు ఫులేను హత్యా చేయడానికి ప్రయత్నించారు, ఎందుకంటే ఫులే బహుజనులకు విద్యను అందించడాన్ని బ్రాహ్మణులు సహించలేదు.

11. 11 మే 1888 న, ముంబైలోని “ముంబై దేశస్థ మరాఠాధ్యతి ధర్మ సంస్థ” లో జ్యోతిబా ఫులేకు ప్రజలే  ‘మహాత్మా’ బిరుదు ఇచ్చారు.

 12. 5 ఫిబ్రవరి 1852: మహాత్మా జ్యోతిబా ఫులే తను నడిపే విద్యా సంస్థల కోసం ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం కోరారు.

13.  అంటరానివారికి మరియు బాలికల కోసం మొదటి పాఠశాలలను ఫులే జంట ప్రారంభించారు: భిదేవాడ (పూణే) - 1848 జనవరి 1న మహాత్మా జోతిబా ఫులే మరియు సావిత్రిబాయి ఫులే గార్లు  బాలికల కోసం భారతదేశపు మొదటి పాఠశాల ప్రారంభించారు.

 14. అంటరానివారి నీడను కూడా అశుద్ధంగా భావించే సమయంలో, అంటరానివారి దాహం తీర్చేందుకు నీరు ఇవ్వడానికి ప్రజలు ఇష్టపడనప్పుడు, సావిత్రిబాయి ఫులే మరియు మహాత్మా జోతిబా ఫులే అంటరానివారి కోసం వారి ఇంటిలోని బావిని వాడుకునే సౌకర్యం కల్పించారు.

15. 28 జనవరి 1853: భారతదేశంలో మొట్టమొదటి శిశుహత్య (భృనహత్య) నిషేధ గృహాన్ని ఫులే దంపతులు ప్రారంభించారు.

16. 1863లో, మొట్టమొదటి అనాథాశ్రమాన్ని జోతిబా ఫులే మరియు సావిత్రిబాయి ఫులే ప్రారంభించారు, అందువల్ల సమాజంలో దయనీయులైన గర్భిణీ వితంతువులకు (ప్రధానంగా బ్రహ్మణ స్త్రీలు) రక్షణ కల్పించారు.

 17. జోతిబా ఫూలే పోవాడ:
"చత్రపతి శివాజీరాజే భోస్లే యాంచా" పుస్తకం జూన్ 1, 1869 న మరియు సుప్రసిద్ధ గులాంగిరి పుస్తకం 1 జూన్ 1873 న ప్రచురించారు.

18.  సెప్టెంబర్ 24, 1873 న, జోతిబా ఫులే తన అనుచరులు మరియు ఆరాధకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ‘సత్య శోధక్ సమాజ్’ (The Society of truth seekars) ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరియు జోతిరావు  దానికి మొదటి అధ్యక్షుడిగా మరియు కోశాధికారిగా పనిచేశారు.

 19. 1852 నవంబర్ 16న, ఫూలే, విద్యా రంగంలో చేసిన కృషికి మేజర్ కాండీ గారు  జోతిబా ఫులేను సత్కరించారు.

20 . 18 జూలై 1880 న: విస్తృతంగా మద్యం అమ్మకాలను  తీవ్రంగా పరిగణించి మహాత్మా జోతిబా ఫులే పూణే మునిసిపాలిటీ యొక్క యాక్టింగ్ కమిటీ అధ్యక్షుడు ప్లంకెట్‌కు ఒక లేఖ రాశారు.  మద్యం దుకాణాలకు ప్రభుత్వం ఎక్కువ లైసెన్సులు ఇవ్వాలనుకున్నప్పుడు, జోతిరావ్ ఈ చర్యను ఖండించారు, ఎందుకంటే మద్యం వ్యసనం ఎన్నో పేద కుటుంబాలను నాశనం చేస్తుందని ఆయన భావించారు.

21. పత్రికా స్వేచ్ఛ కోసం నిలబడటం:-
1880 నవంబర్ 30 న పూనా మునిసిపాలిటీ అధ్యక్షుడు,' భారత గవర్నర్ జనరల్ లార్డ్ లైటన్' సందర్శన సందర్భంగా ₹1000/- ఖర్చు చేయాలన్న  ప్రతిపాదనను ఆమోదించాలని సభ్యులను అభ్యర్థించారు.  ఆయన పూనా పర్యటన సందర్భంగా అధికారులు ఆయనకు చక్కటి సందేశం, ఆహ్వానం ఇవ్వాలనుకున్నారు.  
లైటన్ అందుకు అనుగుణంగా ఒక చట్టాన్ని ఆమోదించారు. దీనికి వ్యతిరేకంగా పత్రికలు గగ్గోలు పెట్టాయి, మరియు సత్య శోదక్ సమాజ్ యొక్క అనుబంధ దీన్‌బంధు పత్రికా స్వేచ్ఛపై దాడికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు ఫూలే.

లైటన్ వంటి అతిథిని గౌరవించడంలో ప్రజాధనాన్ని (పన్ను చెల్లింపుదారుల ధనాన్ని) ఖర్చు చేయాలనే వారి ఆలోచన జోతిరావుకు నచ్చలేదు.  పూనాలోని పేద ప్రజల విద్య కోసం ఈ మొత్తాన్ని  ఖర్చు చేయవచ్చని ఆయన ధైర్యంగా సూచించారు. పూణే మునిసిపాలిటీలో 32 మంది నామినేటెడ్  సభ్యులలో ఫూలే ఒక్కరే అధికారిక తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన సభ్యుడు.  

 22. బ్రిటీష్ రాయల్ కుటుంబాన్ని సవాలు చేయడం ఈ సంఘటన పేద రైతుల పట్ల ఫూలే గారికి ఉన్న అనుబంధాన్ని, గ్రామీణ ప్రాంతంలోని రైతుల బాధలపై బ్రిటిష్ రాజకుటుంబ సభ్యుని దృష్టిని ఆకర్షించడంలో ఆయనకున్న ధైర్యాన్ని కూడా వెల్లడించింది.


మార్చి 2, 1888 న, జోతిరావ్ యొక్క స్నేహితుడు హరి రావుజీ చిప్లుంకర్ "డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ కొనాట్" గారి గౌరవార్థం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.  రైతులు ధరించే వేషధారణలో జోతిరావు ఈ కార్యక్రమానికి హాజరై ప్రసంగం చేశారు.
  
వజ్రాలతో నిండిన ఆభరణాలను ధరించి తమ సంపదను ప్రదర్శించే ధనవంతులపై ఆయన వ్యాఖ్యానించారు మరియు అక్కడకు వచ్చిన నాయకులు/ అతిథులు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించరని, క్వీన్ విక్టోరియా వారసున్ని మరియు ప్రముఖులను హెచ్చరించారు.  హర్ మెజెస్టి ది క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ గారి దృష్టికి  భారతీయుల యొక్క  పరిస్థితిని తెలుపడానికి 'డ్యూక్ ఆఫ్ కొనాట్' (బ్రిటీష్ రాణి యొక్క మనుమడు) నిజంగా ఆసక్తి కలిగి ఉంటే, తను పూణే సమీపంలోని  గ్రామాలను మరియు అంటరానివారు నివసించే  ప్రాంతాలను సందర్శించాలని సూచించాడు.  విక్టోరియా రాణి మనవడు అయిన కొనాట్ డ్యూక్‌ను ఫులే తన సందేశాన్ని విక్టోరియా రాణికి తెలియజేయాలని అభ్యర్థించారు మరియు పేద ప్రజలకు విద్యను అందించాలని గట్టిగా విజ్ఞప్తి చేశారు.




విద్య లేకపోతే వివేకం లేదు, వివేకం లేక నీతి లేదు, నీతి లేనిదే పురోగతి లేదు, పురోగతి లేక విత్తంబు లేదు, విత్తంబు లేకనే శూద్రులు అధోగతి పాలయ్యారు, ఇంత అనర్థం ఒక విద్య వల్లనే..’ అన్నఫులే తాత్వికత మీదే నేటి మన బహుజన ఉద్యమం  ఆధారపడివుంది ...






A. భారతీయ సామాజిక వ్యవస్థ - దానిని నిలబెట్టే శక్తులు – పరిష్కార మార్గాలు

CLASS 1 : భారతీయ సామాజిక వ్యవస్థ - దానిని నిలబెట్టే శక్తులు – పరిష్కార మార్గాలు
మొదటి class లో నేర్చుకున్న కొన్ని అంశాలు క్లుప్తంగా ఇక్కడ చూద్దాం...
ఈ దేశంలో నిచ్చెన మెట్ల కులవ్యవస్థ ఏవిధంగా వుందో మనకందరికీ ఒక ప్రాథమిక అవగాహన వుంది. అయితే ఈ అవగాహన మనలను ఈ వ్యవస్థను కూల్చడానికి పురికొల్పే విధంగా లేకుండా ఈ వ్యవస్థ తో సర్దుబాటు దిశగా పయనించే విధంగా వుంది...
ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ యొక్క సూత్రం “Salute the Above and Kick The Below”

ప్రత్యక్షంగా అసమానత్వాన్ని తీసుకుని వస్తే ఎవరూ దాన్ని అంగీకరించరు, కనుక అసమానత్వం అనేది పరోక్షంగా ఒక అబద్ధం చుట్టూ మొదలవుతుంది. 

ఆ అబద్ధం చుట్టూ ఒక కథ అల్లి దానిని మళ్ళీ మళ్ళీ చెబుతూ ఒక బుర్ర కథ లా ప్రచారం చేసి ప్రజల్లో మెదడు లోకి ఎక్కించడం ద్వారా కొన్నాళ్ళకి అది నిజంగా మారుతుంది. 

ఆ నిజంగా మారిన అబద్ధాన్ని కొంతమంది పాటిస్తే అది కట్టుబాటు అవుతుంది.
దీని వలన సామాన్య ప్రజలను తేలికగా దోచుకోవచ్చ అని అనుకున్నప్పుడు, దానికి చట్టబద్ధత కల్పిస్తే అది శాసనం అవుతుంది. 

ఈ శాసనం తరువాతి తరాలకు కూడా‌ ప్రాకితే అది సాంప్రదాయం అవుతుంది. ఒక వేళ ప్రజాస్వామ్యాన్ని సమానత్వాన్ని గౌరవించే రాజు వస్తే ఆ సాంప్రదాయం కాస్త మంటలో కలిసి పోతుంది.

కనుక మంటల్లో తగలపడకుండా  కాపాడుకోవటానికి, ఆ సాంప్రదాయానికి పవిత్రత చేకూర్చి ధర్మాన్ని 
(మతాన్ని) సృష్టించడం జరుగుతుంది. ఆ మతానికి పునాదులుగా అసమానత్వం అనే శాసనాలను, సిద్ధాంతాలు గా చేయడం వలన మన (బహుజనుల) అభివృద్ధి ఆగిపోయి ఎక్కడ వేసిన గొంగళి లా అక్కడే  ఆగిపోతుంది.
(ఇక్కడ అసమానతలను పెంచి పోషించే ధర్మం-మతం గురించి మాట్లాడుతున్నాము...)
ఈ యొక్క అసమానత్వం అనే సిద్ధాంతం పునాదిగా ఏర్పడిన వ్యవస్థ గురించి తెలుసుకునే ముందు ఈ యొక్క సిద్ధాంతం వలన కష్టాల్లో పడింది ఎవరు??
ఈ యొక్క సిద్ధాంతం వల్ల లాభం  ఎవరికి??
ఈ యొక్క సిద్ధాంతం సృష్టికర్త ఎవరు??
ఈ విషయాలు ముందు తెలుసుకుందాం.

మనం క్లాసు లో చెప్పుకున్నట్టు కష్టాల్లో ఉన్న వారి సంఖ్య సుమారు 85 శాతం ఉండొచ్చు, వారి గుర్తింపు ఏమిటి? కనుక కష్టాల్లో లేని వారు అంటే  సుఖాల్లో (15%) ఉంటున్న వారి గుర్తింపు ఏమిటి?
ఎప్పుడూ కష్టాల్లో ఉన్నారు అంటే బానిసలు అని అర్థం. బానిసలకు వేరే పదం శూద్రులు అని కూడా ఉంది. అప్పట్లో శూద్రులు ఇప్పుడు SC, ST, OBC, MINORITIES గా పిలవబడుతున్నారు.
శూద్రులు కాకుండా మిగిలిన వారు ఎవరు??
బ్రాహ్మణులు 
క్షత్రియులు 
వైశ్యులు. 
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర.  ఈ నాలుగింటిని కలిపి చాతుర్వర్ణ వ్యవస్థ అంటారు.
ఇందులో శూద్రులు బానిస ఐతే మిగిలిన వారు అగ్రవర్ణాల వారు అవుతారు.
కనుక ఈ అగ్రవర్ణాల లో ఒకరు శూద్రుల బానిసత్వానికి కారకులవుతారు.
ఈ అగ్రవర్ణాలలో అందరికన్నా పైన ఉన్న వారు ఎవరు?



_బ్రాహ్మణులు._ 
ఈ బ్రాహ్మణులను అందరి నెత్తి మీద పెట్టిన సిద్దాంతం ఏమిటి?
మనువాదం
మనువాదానికి మూలం మనుస్మృతి .

మనువాదానికి మూలమైన మనుస్మృతి బ్రాహ్మణులు బ్రహ్మ ముఖం నుంచి పుట్టాడు కనుక బ్రాహ్మణులు పుట్టుకతోనే ఉత్తములు.
పైన పోస్ట్ లు మీరు గమనించినట్లయితే బొడ్డు కింద భాగం, అపరిశుభ్రం, బొడ్డు పై భాగం పరిశుభ్రం అని అందుకు బ్రాహ్మణులు మరియు క్షత్రియులు ఉత్తములు అని చెప్పారు.
బ్రహ్మ తొడల నుంచి వైశ్యులు పాదాలనుంచి శూద్రులు పుట్టారు.
కనుక బ్రాహ్మణులు క్షత్రియులు కంటే వైశ్యులు శూద్రులు అల్ప జాతులు అని అర్థమవుతుంది వీరిద్దరిలో శూద్రులు, వైశ్యులు కన్నా  కింది వారు.
కనుక అందరికి బానిసలు శూద్రులు అని చెప్పడం జరిగింది...

మీరు గమనించినట్లయితే బ్రాహ్మణ ధర్మం ప్రకారం స్త్రీకి స్వేచ్ఛ అనేది లేదు. 

ఇక్కడ కేవలం శూద్ర స్త్రీ అని చెప్పలేదు, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వెశ్యుడు, శూద్రుడు అని పురుష లింగం మాత్రమే ప్రస్తావించారు కాని, ఎక్కడా బ్రాహ్మణురాలు, క్షత్రియురాలు, వైశ్యురాలు అని స్త్రీ లింగం తో పిలవలేదు, అంటే దీని అర్థం స్త్రీ ఎవరైనా బానిసే అని.

అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అందరి స్త్రీ లు బానిసలే. అని మనుధర్మ శాస్త్రాం చెబుతుంది. 
బాల్యంలో తండ్రి చెప్పుచేతల్లో యవ్వనంలో భర్త అధీనంలో పెద్దయిన తర్వాత తన బిడ్డల యొక్క మాటలు వింటూ జీవితం గడపాలని బ్రాహ్మణ మనుధర్మం చెబుతుంది.
ఎటువంటి స్వతంత్రం లేకుండా జీవితాంతం బానిసగా గడపాలని బ్రాహ్మణులు మనుస్మృతి చెబుతుంది.

స్రీలపై జరుగుతున్న అత్యాచారాలు :
‘బేటీ పడావో బేటీ బచావో’ అని నినదించే రాజ్యం స్కూలుకి వెళ్లటానికి కనీసం బస్సు కూడా ఏర్పాటు చేయకపోతే నాలుగైదు మైళ్లు డొంకదారుల్లో నడిచిపోయే హాజీపూర్ పిల్లలు కావచ్చు, అమ్మ పక్కన ఆదమరిచి నిద్రపోయే నెలలపాప కావచ్చు, ఇంతమంది తిరిగే చోట భద్రమే అనుకుని స్కూటర్ పార్కు చేసుకున్న దిశ కావచ్చు, స్నేహితుడే కదా అని నమ్మిన మానస కావచ్చు, రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని ఇల్లు చేరుకునే తొందరలో ఉన్న టేకు లక్ష్మి కావచ్చు, హాస్టల్ లో ప్రశాంతంగా ఉన్నాననుకున్న ఆయేషా మీరా కావచ్చు, సినిమా తార అయి కూడ (బహుశా అయినందువల్లనే) రక్షణ లేని ప్రత్యూష కావచ్చు, మనకు తెలియని మరెవరో కావచ్చు. నేర స్వభావం అనేది పేద ధనిక భేధం లేకుండా పెరుగుతూ ఉందన్నది ఒక వాస్తవం. కాని నేరస్తులు పేద వారో లేదా భాదితులు మధ్యతరగతి లేదా ఆ పైవర్గం వాళ్లో అయినప్పుడు మాత్రమే అవి వార్తలు కావడం, లేదా అందులో నేరస్తులకి శిక్షలు పడటం ఈ దేశపు వాస్తవం. నేరస్తులు పైవర్గం వాళ్లయితే, వాళ్లకు రాజకీయ అండదండలు ఉంటే వాస్తవాలు బయటికి రావు.
బ్రాహ్మణీయ నిచ్చన మెట్ల కులవ్యవస్థ దుష్ఫలితాలే ఇలాంటి అత్యాచారాలు. POLITICAL POWER లేకపోవడమే ఈ సంఘటనలన్నింటికి కారణం...


The Chamcha Age Video

Poona Pact