Sunday, July 17, 2022

బాబాసాహెబ్ రాజకీయోద్యమం

బాబాసాహెబ్ తన 29 వ ఏటనే ఒక రాజకీయ నాయకునిగా emerge కావడం జరిగింది . 

   1920 నుండి 1935 వరకు సాధారణ స్థాయి ఉద్యమం
   సామాజిక, రాజకీయ అంశాలకు ప్రాధాన్యత
   అంటరాని/అణగారిన వర్గాలకు స్పృహ కల్పించడం
   చైతన్య పర్చడం , ఐక్యం చేయడం
 బహిష్కృత హితకారిణి సభ ద్వారా కార్యక్రమాలు

సౌత్‌బరో కమిటీ ముందు హాజరై ఒక విశాల ప్రాతిపదిక పై మూడు ముఖ్యమైన ప్రతిపాదనలు చేసారు :

1. అంట రాని కులాల పక్షాన తమ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ఎన్నికకాకపోతే, అంటరానితనం నిర్మూలన కాదు. 
2. కౌన్సిళ్లలో అంటరాని కులాల ప్రజాప్రతినిధులు ఆధిపత్య కులాలకు సంబంధిం చిన మెజారిటీ సభ్యులని మించకూడదని, ప్రభుత్వమే అంటారని కులాల నుంచి తగు సమర్థులను ఎంపిక చేయాలని అంబేడ్కర్‌ వాదించారు. 
3. అంటరాని కులాలు రాజకీయంగా ఎదగాలంటే, వారి అభ్యర్థుల్ని వారే ఎన్నుకునే విధానం అమలు చేయాలని అంబేడ్కర్‌ కోరారు.
అంతేకాకుండా, ప్రతి పౌరుడికీ చదువు, సంపద కాకుండా ఓటింగ్‌ హక్కు ఉండాలని వాదించిన తొలి వ్యక్తి కూడా అంబేడ్కరే. అప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించి 34 ఏళ్ళు గడిచినప్పటికీ ఇటువంటి అత్యంత ప్రధానమైన రాజకీయ డిమాండ్‌ను చేసిన పాపాన పోలేదు.
[7/16, 8:28 PM] Arun BHEL buddhist: చత్రపతి సాహూమహారాజ్ ఆర్ధిక సహకారం మూలంగానే డాక్టర్ అంబేర్కర్ 'మూక్‌నాయక్ ప్రత్యేక సంచికను వెలువరించడం జరిగింది. 22 మార్చి 1920లో దక్కన్ అస్పృశ్య సమాజపు సమ్మెళనం జరిగింది. దానీకి అధ్యక్షత డాక్టర్ అంబేద్కర్ వహించగా సాహుమహారాజ్ విశిష్ట అతిథిగా పాల్గొన్నాడు. సాహూజీ తన ప్రసంగంలో డాక్టర్ అంబేద్కర్‌ “మేదావులకే అలంకార ప్రాయమైనవాడు”. తమ ప్రజానికాన్ని ఉద్దరించడానికి అంకితమైన నిబద్దత కలవాడు. మీ నాయకున్ని మీరే వెతికిపట్టుకున్నారు. అందుకోసం మీక్కూడా ధన్యవాదాలు చెబుతున్నాను. మీ అభ్యున్నతి కోసం ఎల్లవేళలా కేవలం అంబేద్కరే కృషి చేస్తాడనే విశ్వాసం నాకు కలుగుతోంది. అంతేకాదు ఒకనాడు ఏదో సమయంలో అంబేద్కర్ అఖిలభారత నాయకుడవుతాడనే నమ్మకం నాకుంది. మీరంతా ఈ నాయకుడిని అనుసరించండని ఆదేశించడంతో కరతాళద్వనులతో ప్రజలంతా స్వాగతించారు. సాహూజీ భవిష్యవాణిని పలికి రాబోయో కాలంలో జరిగిన చరిత్రను కళ్లముందు చూపించాడు.

సైమన్ కమిషన్ : 

1927 వ సంవత్సరములో భారత దేశములోని అణచివేయబడ్డ ప్రజల తరగతి యొక్క స్థితిగతుల అధ్యయనము కోసమని సైమన్ గారి అధ్యక్షతలో ఒక కమీషన్ ను నియమించింది ఆంగ్లేయ ప్రభుత్వము. సైమన్ గారు స్వయాన అవిభక్త భారత దేశములోని లాహోర్ చేరుకున్నప్పుడు, కాంగ్రెస్ మరియు గాంధీ  అనుచరులు దేశము మొత్తములో అన్ని చోట్ల సైమన్ గారికి వ్యతిరేక ప్రదర్శనలు జరుపబడ్డాయి. లాహోర్ లో సైమన్ గారికి నల్ల జెండాలు చూపెడుతూ "సైమన్ వెనక్కి వెళ్ళిపో" అంటూ నినాదాలు ఇచ్చారు, ముందుకు సాగనివ్వలేదు. బాబాసాహెబ్ లాహోర్ చేరుకొని 400 పేజీల నిమ్నవర్గాల దీనావస్థలను గురించిన నివేదనా పత్రాన్ని సైమన్ కి సమర్పించారు.  కాంగ్రెస్ పార్టీ వాళ్లేమో సైమంకి నిజానిజాలు తెలవనివ్వకుండా చేసేందుకు, ఆయన కళ్ళలో దుమ్ముకొట్టి మోసము చేసేందుకని కొంతమంది బ్రాహ్మణులతో దళిత బహుజనుల సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసింది. 

(సహపంక్తి భోజనాలలో పాలుగొన్న బ్రాహ్మణులు తరువాత తమ తమ ఇళ్లకు వెళ్లి గోమూత్రాన్ని త్రాగి, దానితో స్నానమాచరించి శుద్ధులవ్వడానికి ప్రయత్నించారు)

సౌత్ బొరో కమిటీ ప్రణాలికలను పూర్తి చేయటానికి అంటే ప్రజా స్వామ్య పరిపాలన నెలకొల్పడానికి 1928 లో సైమన్ కమిషన్ ఏర్పాటు చేశారు.

అంటే సైమన్ కమిషన్ మూలనివాసులకి (OBC, SC, ST) అందరితో సమానంగా అధికారాలు ఇవ్వటానికి భారత దేశం బయలుదేరింది.  దీనిని వ్యతిరేకిస్తూ గాంధీ సైమన్ గో బ్యాక్ అంటూ నినాదం లేపాడు, దీని అర్థం మూలనివాసులకి (OBC, SC, ST) మా తో సమానంగా అధికారాలు ఇవ్వటానికి మేము ఒప్పుకోము అని చెప్పటం. అంటే గాంధీ బ్రాహ్మణులకు మాత్రమే అధికారం ఉండాలి, శూద్రులకు (OBC, SC, ST) అధికారం ఇవ్వటానికి ఇష్టం లేదు, అంటే గాంధీ ఉద్దేశ్యం బానిసలు బానిసలుగా నే ఉండాలి .....

మన స్కూల్ పుస్తకాలలో మాత్రం సైమన్ గో బ్యాక్ అనేది స్వాతంత్ర్య పోరాటం కోసం గాంధీ చేసిన ఉద్యమం గా రాశారు.

ఇప్పుడు బ్రిటిష్ వారు అందరికి అధికారాలు ఇస్తానికి వస్తే, దీనిని బ్రాహ్మణులు మరియు గాంధీ ఎందుకు వ్యతిరేకించారో మనం ఆలోచించాలి. సైమన్ కమీషన్ నిజానికి (OBC, SC, ST, MINORITIES) కి ఉపయోగకరం కాని ఈ విషయాలను మరుగునపెట్టి లేని పోని విషయాలను తప్పుడు ప్రచారం చేశారు గాంధీ మరియు బ్రాహ్మణులు, వారు స్దాపించిన మీడియా ద్వారా. మీడియా లో వచ్చే ఈ ప్రచారాలు నమ్మి చాలా మంది గాంధీ వెనకాల వెళ్ళారు, అప్పటికే సత్య సోదక్ సమాజ్ ను కూల్చి OBC లను కాంగ్రెస్ లో కలిపేసుకున్నారు బ్రాహ్మణులు, చాలా వరకు మన అమాయకపు మూలనివాసులు ఈ తప్పుడు ప్రచారం నమ్మేశారు. 

బ్రిటిష్ వారికి కూడా చాలా కోపం వచ్చింది, మీ కోసం మేము వస్తే మా మీదే తప్పుడు ప్రచారం చేస్తారా? అని భారతీయ ప్రతినిధులనే వారి దగ్గరకు లండన్ రమ్మన్నారు...అవే 1930 - 1932 లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలు


రౌండ్ టేబుల్ సమావేశాలు :

రౌండ్ టేబుల్ సమావేశాలకు నామినేషన్లు సమర్పించినవారు వెళ్ళారు.  గాంధీ వెళ్ళలేదు, ఎందుకంటే ఆయన చేసిన సైమన్ గో బ్యాక్, విజయవంతం అయ్యిందనుకున్నాడు. ముస్లిం లీగ్ ప్రతినిధి అయిన జిన్నా కూడా మొదటి, రెండవ  రౌండ్ టేబుల్  సమావేశాలు మాత్రమె హాజరయ్యారు. రౌండ్ టేబుల్ సమావేశాలు మొదలైనప్పుడు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు తన యొక్క ప్రతిపాదనలు బ్రిటిష్ వారి ముందు ఉంచాడు.

ఆ ప్రతిపాదనలలో ముఖ్యమైనవి
1) Adult franchise (యుక్త వయస్సు వచ్చిన అందరికీ ఓటు హక్కు)
2) Adequate representation (జనాభా ప్రాతిపదికన సరిపడేంత ప్రాతినిధ్యం)
3) Separate electoral (ప్రత్యేక ఎన్నికలు)
4) Dual voting (రెండు ఓట్లు)
అన్ని వాదోపవాదాలు విని చర్చించిన తరువాత, బ్రిటిష్ వారు ఇవన్నీ సమంజసంగా ప్రజాస్వామ్య రీతిలో అందరికి సమానంగా ఉన్నాయని గ్రహించి కమ్యూనల్ అవార్డ్స్ అన్న పేరుతో డా: అంబేద్కర్ గారి ప్రతిపాదనలను ఆమోదించింది. అందరూ (OBC, SC, ST &MINORITIES) సంతోషించారు, ఎందుకంటే అందరికి సమాంతరంగా తమ ప్రతినిధులను తమ యొక్క సమస్యలను పార్లమెంటు లో విన్నవించుకునే అవకాసం కలిగింది.

అందరూ ఆనందిస్తుంటే, ఒక్కరు అడ్డుకున్నారు. ఆయనే మోహన్ దాస్ కరం చంద్ గాంధీ...
అదే పూనా ఒప్పందం రూపంలో నిజమైన బహుజన రాజకీయ ప్రాతినిద్యానికి గొడ్డలి పెట్టు.  పూనా ఒప్పందం ప్రాజాస్వామ్యానికి చావు దెబ్బ, అది బ్రాహ్మణులు మరియు గాంధీ కలిసి పన్నిన పన్నాగం.


(పూనా పాక్ట్ గురించి, బాబాసాహెబ్ రాజకీయ పోరాటం గురించి మరింత సమాచారం ముందు తరగతుల్లో చూద్దాం...)

No comments:

Post a Comment

The Chamcha Age Video

Poona Pact