Sunday, July 17, 2022

భారత దేశంలోని రాజకీయ పార్టీలు


మనదేశంలో స్వాతంత్య్రానికి పూర్వమే రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి. 1885 లో కాంగ్రెస్‌ స్థాపనతో మన దేశంలో రాజకీయ పార్టీలు ఏర్పడి పనిచేయడం ప్రారంభించాయి. మొదటి దశలో కాంగ్రెస్‌ రాజకీయ పార్టీగా కాకుండా ఒక ఉద్యమంగా ఉండేది. 1920 కి పూర్వం దేశంలో రాజకీయపరమైన పార్టీలు లేవనే చెప్పవచ్చు. 1919లో మాంటేగ్‌ చేమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల ఆధారంగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన స్వరాజ్య పార్టీ కాని, ఎన్నికలను బహిష్కరించిన కాంగ్రెస్‌ పార్టీ కాని ఈనాటి పార్టీల స్వభావం కలిగిలేవు. భారత జాతీయ కాంగ్రెస్‌తో పాటు ముస్లిమ్‌ లీగ్‌, హిందూ మహాసభ, భారత కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీలు స్వాతంత్య్రానికి ముందే స్థాపించబడ్డాయి. స్వాతంత్య్రానంతరం అనేక నూతన పార్టీలు ఉద్భవించాయి.

భారత రాజకీయ పార్టీలను స్థూలంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలుగా వర్గీకరించవచ్చు.

జాతీయపార్టీగా గుర్తింపు పొందుటకు కావల్సిన అర్హతలు:

1. లోక్‌సభ ఎన్నికలలో లేదా రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోలై చెల్లిన ఓట్లలో 6% పొందాలి. ఈ ఓట్లు అనేవి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో పొంది ఉండాలి.
పై వాటితో పాటు లోక్‌సభ ఎన్నికలలో కనీసం 4 స్థానాలను ఒక రాష్ట్రం నుంచి కాని అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో గెలుపొందాలి.
(లేదా)
2. లోక్‌సభ ఎన్నికలలో కనీసం 2% సీట్లను మూడు భిన్న రాష్ట్రాల నుంచి గెలుపొందాలి.
(లేదా)
3. ఒక పార్టీ నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీగా గెలుపొందాలి.

ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి అంటే

1. ఎ) లోక్‌సభ లేదా రాష్ట్ర శాసన సభ ఎన్నికలలో పోలై చెల్లిన ఓట్లలో 6% ఓట్లను ఆ రాష్ట్రంలో పొందాలి.
బి) ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కనీసం రెండు స్థానాలను గెలుపొందాలి. లేదా ఒక లోక్‌సభ స్థానాన్ని గెలుపొందాలి.
(లేదా)
2. ఆ రాష్ట్ర శాసన సభకు జరిగిన ఎన్నికలలో 3% సీట్లను లేదా మూడు సీట్లను గాని గెలుపొందాలి. (ఏది ఎక్కువ అయితే అది).
(లేదా)
3. రాష్ట్రంలోని ప్రతి 25 లోక్‌సభ స్థానాలకు ఒక స్థానాన్ని గెలుపొందాలి.

మెజారిటీ పార్టీకి పరిపాలించే అధికారం ఉన్నట్లే ప్రతిపక్షాలకు అధికార పార్టీ లోటుపాట్లను ఎత్తిచూపి, దాని విధానాలను వ్యతిరేకించి, అధికార పీఠం నుంచి దాన్ని పడగొట్టే హక్కు ఉంటుంది. అధికార పక్షం లోపాలను బహిర్గతం చేసి ప్రజా బాహుళ్యానికి తెలియపరచడంలో ప్రతిపక్షాలు కీలకపాత్రను నిర్వహిస్తాయి.

గేబ్రియల్‌ ఆల్‌మండ్‌ చెప్పినట్లు “రాజకీయ పార్టీలు ప్రయోజనాన్ని సమీకరించే సంస్థలుగా, ప్రజాభిప్రాయానికి మెరుగులు దిద్దే సంస్థలుగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజల తీర్పును కోరే సంస్థలుగాను పనిచేస్తాయి”.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుండి భారత దేశాన్ని ఏ సామాజిక వర్గం పాలించింది అనేది తెలుసుకుందాం.

1 = 1947 జవహర్‌లాల్ నెహ్రూ (బ్రాహ్మణ)
2 = 1964 గుల్జారిలాల్ నందా(బ్రాహ్మణ)
3 = 1964 లాల్ బహదూర్ శాస్త్రి(బ్రాహ్మణ)
4 = 1966 గుల్జారిలాల్ నందా(బ్రాహ్మణ)
5 = 1966 ఇందిరా గాంధీ(బ్రాహ్మణ)
6 = 1977 మొరార్జీ దేశాయ్(బ్రాహ్మణ)
7 = 1979 చరణ్ సింగ్(బ్రాహ్మణ)
8 = 1980 ఇందిరా గాంధీ(బ్రాహ్మణ)
9 = 1984 రాజీవ్ గాంధీ(బ్రాహ్మణ)
10 = 1989 విశ్వనాథ్ ప్రతాప్ సింగ్(బ్రాహ్మణ)
11 = 1990 చంద్రశేఖర్(బ్రాహ్మణ)
12 = 1991 పివి నరసింహారావు(బ్రాహ్మణ)
13 = అటల్ బిహారీ వాజ్‌పేయి(బ్రాహ్మణ)
14 = 1996 ఎ. డి. దేవేగౌడ(ఒబిసి)
15 = 1997 ఐకె గుజ్రాల్(బ్రాహ్మణ)
16 = 1998 అటల్ బిహారీ వాజ్‌పేయి(బ్రాహ్మణ)
17 = 2004 డాక్టర్ మన్మోహన్ సింగ్(సిక్కు)
18 = 2014 నుండి నరేంద్ర మోడీ(బిసీ ముసుగులో ఉన్న వైశ్యా)

భారతదేశంలో నూటికి 50 శాతం పైగా ఒబిసిలున్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కలిసి 35 లేదా 45 శాతం ఉంటారు. మరి మూడు శాతం కూడా లేని బ్రాహ్మణులు ప్రధానమంత్రులు ఎందుకు అవుతున్నారు. కారణం మన దేశంలో రాజకీయ పార్టీల తరపున ప్రధానమంత్రి నామినేట్ చేయబడతారు. జాతీయ పార్టీల నుంచి ప్రధానమంత్రులు అవుతున్నారు. జాతీయ పార్టీలన్నీ బ్రాహ్మణ, బనియా(వైశ్యా), క్షత్రియుల కోసం ఏర్పాటు చేసుకున్నవేనన్న నిజాన్ని నూటికి తొంబై శాతం జనాభా గల ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీలు తెలుసుకోలేక పోతోన్నారు. బ్రాహ్మణ పార్టీలకే ఓట్లు వేస్తోన్నారు. కాంగ్రెస్ పార్టీ , బిజెపి, తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఇవన్నీ బ్రాహ్మణులు తమ మనువాద సిద్ధాంతాలకు ఎక్కడ భంగం కలుగుతుందోననే భయంతో, ముందు జాగ్రత్తగా తమ మనుగడ కోసం చైతన్యంతో ఏర్పాటు చేసుకున్నవే ఈ జాతీయ పార్టీలు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు గత 60 సంవత్సరాలుగా.

రెడ్డి (33-38years)
B. గోపాల "రెడ్డి"----1.5 years
N. సంజీవ "రెడ్డి" ----6 years
K. బ్రహ్మానంద "రెడ్డి" ---7.5 years
M. చెన్నా "రెడ్డి" ---3.5 years
B. వెంకటరామ "రెడ్డి" --7 months
K. విజయభాస్కర్ "రెడ్డి" -- 2.5 years
N. జనార్ధన్ "రెడ్డి" --2 years
YS. రాజశేఖర "రెడ్డి" -- 5.4years
N. కిరణ్ కుమార్ "రెడ్డి" --3.4 years
YS. జగన్మోహన్ "రెడ్డి"--ప్రస్తుతం

కమ్మ (20years)
N. రామారావు--6years
N. భాస్కర్ రావు--1 month
N. చంద్రబాబు నాయుడు---14years

బ్రాహ్మణ (3.5years)
T. ప్రకాశం ---1year
PV. నరసింహారావు---1.4years

D. సంజీవయ్య---2years(దళిత)
T. అంజయ్య---1.3years(రెడ్డి)
జలగం వెంగలరావు---4.3years(వెలమ)
K. రోశయ్య---1year( vysshya)

తెలంగాణ ముఖ్యమంత్రి : కెసిఆర్ (వెలమ)
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు .

మిత్రులారా ఈ దేశ రాజకీయ ముఖచిత్రం బ్రాహ్మణీయ కుల వ్యవస్థ రూపొందించిన విధంగానే నడుస్తుంది అనడానికి ఇవే ఉదాహరణలు...

ఇవన్నీ చూస్తే ఆ మహనీయుడు ఎందుకు “Political Power is the Master Key…”అన్నాడో మాన్యవర్ కాన్షిరాం గారు ఆ power కోసం జీవితాన్ని ఎందుకు త్యాగం చేసాడో ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అర్థమవుతుంది..

No comments:

Post a Comment

The Chamcha Age Video

Poona Pact